ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) అదిరిపోయే ఆఫర్. పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ ఫెలోషిప్ పీహెచ్డీ పూర్తి చేసిన ఇండియన్ నేషనల్స్ నుండి ఎస్బీఐ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1 లక్ష స్టైఫండ్ అందిస్తుంది. అంతేకాదు, వారి పర్ఫార్మెన్స్ ఆధారంగా ఆ తర్వాత ఒకేసారి రూ.2 లక్షల నుండి రూ.5 లక్షల వరకు అందిస్తుంది. ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్స్కు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 18వ తేదీ నుండి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే దరఖాస్తుకు గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. అక్టోబర్ 8వ తేదీ చివరి తేదీ.

వయో పరిమితి.. ఖాళీలు..
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వారు అప్లికేషన్ ప్రింట్ కాపీనీ తీసుకొని ముంబైలోని ఎస్బీఐ కార్పోరేట్ సెంటర్కు అక్టోబర్ 15వ తేదీలోగా పంపించాలి. జూలై 31, 2020 నాటికి దరఖాస్తుదారు వయస్సు 40 మించకూడదు. ఈ కాంట్రాక్ట్ రెండేళ్ల కాలం ఉంటుంది. ఐదుగురికి మాత్రమే ఈ బంపరాఫర్ దక్కుతుంది. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ కోసం ఈమెయిల్ ద్వారా కాల్ లెటర్ పంపిస్తారు. అంతేకాదు, ఎస్బీఐ వెబ్ సైట్లోను అప్ లోడ్ చేస్తారు.

విద్యార్హతలు
ఎంపిక చేసిన దరఖాస్తుదారుని కోల్కతాలోని స్టేట్ బ్యాంక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లీడర్షిప్కు పంపిస్తారు. అభ్యర్థి బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్ లేదా ఐటీ లేదా ఎకనమిక్స్ లేదా ఏదైనా సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్డీ చేసి ఉండాలి. అభ్యర్థికి మంచి అకడమిక్ రికార్డ్ ఉండాలి. ఎవరైనా ఏ కేటగిరీ జర్నల్స్ రాసి ఉంటే ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థులు ఐఐఎం, ఐఐటీ, ఐఎస్బీ, ఎక్స్ఎల్ఆర్ఐ లేదా ఇతర సమాన ఇనిస్టిట్యూషన్స్ లేదా కన్సల్టెన్సీ బోధన/పరిశోధనలో మూడేళ్ల అనుభవం ఉండాలి. అభ్యర్థులకు అంతర్జాతీయ, జాతీయ కాన్ఫరెన్స్లకు అయ్యే ఖర్చును ఎస్బీఐ భరిస్తుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
https://bank.sbi/careers లేదా https://www.sbi.co.in/careers ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ వెబ్ సైట్లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి.
ఫోటో, సంతకం స్కాన్ చేసి అప్ లోడ్ చేయాలి.
బర్త్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్, ఐడీ ప్రూఫ్ తదితర కాపీలు జత చేయాలి. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసేటప్పుడు వీటిని అప్ లోడ్ చేయాలి.
ఇంటర్వ్యూకు సెలక్ట్ అయినప్పుడు ఒరిజినల్స్ తీసుకు రావాల్సి ఉంటుంది.
అప్లికేషన్ ప్రింట్ అవుట్తో పాటు అవసరమైన అన్ని పత్రాల స్వీయ ధృవీకృత కాపీనీ ఎస్బీఐ ముంబై కార్పోరేట్ కార్యాలయానికి పంపించాలి.

ముఖ్యమైన తేదీలు
రెండేళ్ల పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ ఫెలోషిప్ దరఖాస్తు కోసం ముఖ్య తేదీలు..
దరఖాస్తు ప్రారంభమైన తేదీ - 18 సెప్టెంబర్ 2020
దరఖాస్తు చివరి తేదీ - 08 అక్టోబర్ 2020
దరఖాస్తులో మార్పులకు చివరి తేదీ - 08 అక్టోబర్ 2020
మీ అప్లికేషన్ ప్రింటింగ్ చివరి తేదీ - 31 అక్టోబర్ 2020
ఆన్లైన్ ఫీ-పేమెంట్ - 18 సెప్టెంబర్ - 08 అక్టోబర్
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications