రుణాలు తీసుకునేవారికి బ్యాడ్ న్యూస్!: ఎన్బీఎఫ్సీలోకి వచ్చే నిధులు ప్రియం కావడమే కారణం
న్యూఢిల్లీ: నాన్ బ్యాంకింగ్ పరిశ్రమకు, అక్కడి నుంచి రుణాలు తీసుకునే వారికి చేదువార్త. నాన్ బ్యాకింగ్ ఫైనాన్సింగ్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ) ఇచ్చే అప్పులు ప్రియం కానున్నాయి. ఇప్పటికే ఎన్బీఎఫ్సీ తీవ్ర నిధుల కొరతతో అస్తవ్యస్తమవుతోంది. మరోవైపు, వీటికి రుణాల రూపంలో అందే సొమ్ములు కూడా ప్రియం కానున్నాయి. దీంతో ఈ సంస్థలు ఇచ్చే అప్పులపై వడ్డీ రేట్లు కూడా పెరిగే అవకాశముంది.
ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ: తప్పించుకునేందుకు నీరవ్ మోడీ ఎన్ని ఎత్తులు వేశాడో తెలుసా?
సాధారణంగా సూక్ష్మ రుణ మార్కెట్లో ఎన్బీఎఫ్సీల ఆధిపత్యం ఎక్కువ. దీంతో కొన్ని పరిశ్రమలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఈ రుణాలు ఎక్కువగా తీసుకుంటారు. ప్రస్తుతం ఎన్బీఎఫ్సీలు ఇచ్చే రుణాలు ప్రియం అయితే ఈ వర్గాల వ్యాపారాలు మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో ఎన్బీఎఫ్సీలు వడ్డీ రేట్ల తగ్గింపు కోసం ఆర్బీఐ పైన ఒత్తిడి పెంచాయి. ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం సైతం ఎన్బీఎఫ్సీలపై ఒత్తిడి పెంచాలని భావించడంలేదు.
గత ఏడాది ఐఎల్ఎఫ్ఎస్ సంస్థ దివాళ అంచులకు చేరింది. దీంతో సమస్యలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం రంగంలోకి దిగి ఈ ఏడాది వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని పెంచింది. కానీ సమస్యలు తీరలేదు. ఎస్సెల్ గ్రూప్ సమస్యల్లో చిక్కుకోవడం, దేవాన్ హౌసింగ్పై ఆరోపణలు వంటివి ఎన్బీఎఫ్సీ రంగంపై ప్రభావం చూపాయి. ఈ పరిశ్రమకు నిధులు అందటం కష్టమైంది. ఫలితంగా తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే ఎన్బీఎఫ్సీలు వడ్డీ రేట్లను పెంచాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం ఎన్బీఎఫ్సీ పరిశ్రమలో రుణాలు 12 నుంచి 24 శాతం ఉంటాయి. కొన్ని కంపెనీల్లో 26 శాతం వరకు కూడా ఉంటాయి.