ఆన్లైన్ పోర్ట్ల్ను ప్రారంభించిన ఇండియన్ బ్యాంక్, యునైటెడ్ ఇండియా ఇన్యూరెన్స్
ఈ సందర్బంలో బ్యాంక్ సీఎండి టి.ఎం.భాసిన్ మాట్లాడుతూ 2006 నుండి ఇండియన్ బ్యాంక్ ఖాతాదారులకు ఆరోగ్య రక్ష గ్రూప్ మెడిక్లైమ్ ఇన్సూరెన్స్ పాలసీని అందిస్తుందన్నారు. ఫ్లోటర్ విధానం ద్వారా అధిక ప్రీమియం అందిస్తున్న పాలసీ ఇది. గత ఆర్థిక సంవత్సరంలో యూఐఐసీకి చెందిన రూ.31 కోట్ల విలువైన పాలసీలను విక్రయించడం ద్వారా రూ.3.23 కోట్ల ప్రీమియం ఆదాయాన్ని ఆర్జించామని, ఇప్పుడది మరింత పెరుగుతుందన్న ఆశాభావాన్ని భాసిన్ వ్యక్తం చేశారు.
కొత్తగా ప్రారంభించిన ఆన్ లైన్ పోర్టల్ ద్వారా ఈ సంవత్సరం 10,000 పాలసీలను విక్రయించడం ద్వారా కనీసం రూ.20 కోట్ల కమీషన్ ఆదాయాన్ని పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. యునైటెడ్ ఇండియా ఇన్యూరెన్స్ లో ఉన్న మిగతా పాలసీలను కూడా త్వరలోనే ఆన్లైన్ పోర్టల్కి అనుసంధానిస్తామన్నారు. ఇలా అన్ని ఆన్లైన్ కావడం వలన సిబ్బందిపై ఒత్తిడి తగ్గడంతో పాటు.. పాలసీల ప్రక్రియ వేగవంతం అవుతుందని పేర్కొన్నారు.
వన్ఇండియా మనీ తెలుగు