అహ్మదాబాద్: గుజరాత్ ఆర్థిక రాజధాని అహ్మదాబాద్ ప్రధాన కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తోన్న ప్రముఖ ఫార్మాసూటికల్స్ కంపెనీ జైడస్ క్యాడిలా (Zydus Cadila) మరో ఘనతను సాధించింది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన జెనెరిక్ టాబ్లెట్లు అగ్రరాజ్యం అమెరికాలో వినియోగంలోకి రాబోతోన్నాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) అనుమతి ఇచ్చింది. కొన్ని రకాల మానసిక వ్యాధితో బాధపడుతోన్న వారికి అందించే ట్రీట్మెంట్లో దీన్ని వినియోగించాల్సి ఉంటుంది.
స్కీజోఫ్రేనియా సహా కొన్ని రకాల మానసిక వ్యాధులు, డిప్రెషన్తో బాధపడుతోన్న వారికి అందించే చికిత్సలో భాగంగా తాము అభివృద్ధి చేసిన జెనెరిక్ టాబ్లెట్ల వినియోగానికి యూఎస్ఎఫ్డీఏ అనుమతి ఇచ్చినట్లు జైడస్ క్యాడిలా వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఫ్లూఫెనాజైన్ హైడ్రోక్లోరైడ్ రూపంలో ఈ టాబ్లెట్లను అభివృద్ధి చేసినట్లు తెలిపింది. న్యూరోలెప్టిక్, ఫెనోథియాజైన్స్ ఆధారంగా దీన్ని రూపొందించినట్లు వెల్లడించింది. 1 ఎంజీ, 2.5 ఎంజీ, 5 ఎంజీ, 10 ఎంజీ స్ట్రెంగ్త్తో జెనెరిక్ వర్షన్తో ఈ టాబ్లెట్లను అభివృద్ధి చేసినట్లు వివరించిందా సంస్థ యాజమాన్యం.

కాగా- ఇదే సంస్థ ప్రాణాంతక కరోనా వైరస్ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్ను కూడా అభివృద్ధి చేస్తోంది. జైకోవీ-డీ (ZyCoV-D) పేరుతో దీన్ని తయారు చేస్తోంది. ప్లాసిడ్ డీఎన్ఏ వ్యాక్సిన్ ఇది. అన్నీ సవ్యంగా సాగితే జూన్ రెండోవారం నాటికి- ఈ వ్యాక్సిన్ను అత్యవసర పరిస్థితుల్లో వినియోగంలోకి తీసుకుని రావడానికి అవసరమైన దరఖాస్తులను డ్రగ్ కంట్రోలర్ జనరల్కు అందే అవకాశాలు ఉన్నాయి. 12 నుంచి 17 సంవత్సరాల లోపు వయస్సున్న వారిపైనా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది జైడస్ క్యాడిలా. 28 వేల మంది వలంటీర్లపై ట్రయల్స్ పూర్తి చేసింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications