న్యూఢిల్లీ: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఓ కీలక ప్రకటన చేశారు. పెట్రోల్కు సంబంధించిన అనౌన్స్మెంట్ కావడం వల్ల ఆసక్తి నెలకొంది. పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమం విషయంలో తాము విజయం సాధించామని ఆయన ప్రకటించారు. ఇందులో తాము విధించుకున్న డెడ్లైన్ కంటే ముందే లక్ష్యాన్ని అందుకున్నట్లు చెప్పారు. పెట్రోలియం దిగుమతుల్లో ఇదొక కీలక మలుపుగా అభివర్ణించారు.
ఈ మేరకు ఆయన తన అధికారిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. 2022 చివరి నాటికి పెట్రోల్లో 10 శాతం మేర ఇథనాల్ను కలపాలని 2014లో కొత్తగా అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ప్రధాని గుర్తు చేశారు. అయిదు నెలలు ముందుగానే తాము ఈ ఘనతను సాధించినట్లు ప్రకటించారాయన. ఇదో అద్భుత ప్రగతి అని వ్యాఖ్యానించారు.

సేవ్ సోయిల్ మూవ్మెంట్ కార్యక్రమంలోనూ ఇదే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి అనేక చర్యలను తీసుకున్నామని పేర్కొన్నారు. వాతావరణ మార్పుల అంశంలో ప్రపంచంలోనే కీలకంగా వ్యవహరించామని పేర్కొన్నారు. పెట్రోల్లో 10 శాతం మేర ఇథనాల్ను మిళితం చేయడం వల్ల 27 లక్షల టన్నుల మేర కర్బన ఉద్గారాలను తగ్గించగలిగామని అన్నారు. దీనితో పాటు 41,000 కోట్ల రూపాయల ఫారెక్స్ నిల్వలను నిలుపుకోగలిగామని వ్యాఖ్యానించారు.
వచ్చే తొమ్మిది సంవత్సరాల్లో 40 శాతం సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, టార్గెట్ కంటే ముందే దీన్ని అందుకుంటామనే ఆశాభావాన్ని ప్రధాని మోడీ వ్యక్తం చేశారు. ఈ ఎనిమిది సంవత్సరాల తమ ప్రభుత్వ హయాంలో 20,000 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణాన్ని పెంచామని చెప్పారు. సేవ్ సోయిల్ మూవ్మెంట్ను ఈ ఏడాది మార్చిలో సద్గురు జగ్గి వాసుదేవ్ ప్రారంభించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications