Wipro: విప్రో అనగానే మనలో చాలా మందికి గుర్తుకు వచ్చేది దానీ సాఫ్ట్ వేర్ వ్యాపారమే. అయితే నిత్యం వాడే అనేక ఎఫ్ఎంసీజీ వస్తువుల తయారీలో ఈ కంపెనీ చాలా ప్రసిద్ధమైనది. మనందరికీ చిన్నప్పటి నుంచి తెలిసిన సంతూర్ సబ్బు నుంచి ఎలక్ట్రిక్ బల్బుల వరకు అనేక వ్యాపారాల్లో విప్లో విస్తరించి ఉంది. అలా వంటనూనెల విక్రయంతో ప్రారంభమైన విప్రో గ్రూప్ ప్రస్థానం ఐటీ వరకు వెళ్లింది.

స్పీడు పెంచిన కంపెనీలు..
దేశంలోని అన్ని ప్రముఖ బిజినెస్ గ్రూప్స్ తమ వ్యాపారాల విస్తరణలో భాగంగా.. అనేక రంగాల్లోకి ప్రవేశించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ క్రమంలోనే దేశంలోని 4వ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ విప్రో గ్రూప్కు అనుబంధంగా ఉన్న విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్, ఆహార ఉత్పత్తుల రంగంలో తన వ్యాపారాన్ని విస్తరించేందుకు కేరళకు చెందిన ప్రఖ్యాత నిరాపారాను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

విప్రో ప్రకటన..
కొన్ని నెలల కిందట దేశీయ ఆహార ఉత్పత్తుల మార్కెట్లోకి ప్రవేశించే ప్రణాళికను ప్రకటించింది. దీని కింద స్నాక్స్, సుగంధ ద్రవ్యాలు, సిద్ధంగా ఉన్న ఆహార ఉత్పత్తులను విక్రయించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్ వ్యాపారాన్ని విస్తరించడానికి కేరళ ప్రసిద్ధ NIRAPARA కంపెనీని సొంతం చేసుకుంటోంది. దీనికి సంబంధించిన డీల్ పై ఇప్పటికే సంతకాలు జరిగాయి. కంపెనీకి కుక్ విభాగంలో స్థిరమైన స్థానం ఉందని నిరపారా వెల్లడించింది.

నిరపారా ఆదాయం..
కేరళ కేంద్రంగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న నిరపారాకు తన వ్యాపారంలో 63 శాతం కేరళ నుంచి వస్తుండగా.. 8 శాతం భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వస్తోంది. ఇదే క్రమంలో కంపెనీ తన వ్యాపారంలో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి 29 శాతాన్ని సంపాదిస్తోంది. గల్ఫ్ దేశాల నుంచి నిరాపారా తన వ్యాపారాన్ని ఎక్కువగా పొందుతోందని విప్రో ఎంటర్ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్ వినీత్ అగర్వాల్ వెల్లడించారు.

నిరపారా ప్రస్థానం..
1976లో ప్రారంభించబడిన నిరపర మసాలా దినుసులతో పాటు రెడీమేడ్ పుడ్డింగ్ పౌడర్కు ప్రసిద్ధి చెందింది. కేరళ ప్రజలు రోజూ ఉపయోగించే ఉత్పత్తులను నిరపారా ఇంట్లోనే తయారు చేసి విక్రయిస్తోంది. నిరపర బ్రాండ్ మసాలా దినుసులు, అప్పం, ఇడియప్పం, దోస, ఇడ్లీ మొదలైన వాటికి సంబంధించిన రైస్ పౌడర్లు కీలక ఉత్పత్తులుగా ఉన్నాయి.

అంబానీ-అదానీలకు పోటీగా..
ఎఫ్ఎంసీజీ రంగంలో రిలయన్స్ ఇండిపెండెన్స్ పేరుతో పోటీకి సిద్ధం అవుతుండగా. అదానీ విల్మర్ పేరుతో అదానీ గ్రూప్ సైతం భారత వ్యాపారంలో ఉంది. అయితే ఇప్పటికే అనేక ఉత్పత్తులతో ప్రజలకు చేరువైన విప్రో కన్జూమర్ దానిని మరింతగా విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. నిషా అంబానీ రాకలో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ వ్యాపారం శరవేగంగా వృద్ధి చెందుతోన్న సంగతి మనందరికీ తెలిసిందే. దేశంలో FMCG రంగం చాలా పెద్దది మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజలను కవర్ చేస్తున్నందున చాలా కంపెనీలు ఈ రంగంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications