ఐటీలో ఉద్యోగాల కోత తప్పనిసరిగా ఎందుకు మారిందో తెలుసా?
ఐటీ రంగంలో ఉద్యోగాలు గాల్లో దీపాల్లా మారిపోయాయి. ఐటీ దిగ్గజ కంపెనీలైన కాగ్నిజంట్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో తదితర కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. మధ్య స్థాయితో పాటు సీనియర్ స్థాయిలో ఉన్న ఉద్యోగులను ఈ కంపెనీలు టార్గెట్ చేశాయి. వీరినే టార్గెట్ చేయడం వెనుక కారణం లేకపోలేదు. ఇప్పుడు టెక్నాలజీ వేగవంతంగా మారిపోతోంది. ఇందుకు అనుగుణంగా ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగు పరచుకోవాలి. కొత్త టెక్నాలజీలను నేర్చుకోవాలి. లేకపోతే వీరి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని భావిస్తున్న కంపెనీలు వారిని వదిలించుకోవాలని భావిస్తున్నాయి. ఐటీ రంగంలో తలపండిన నిపుణులు ఇదే మాట చెబుతున్నారు. మధ్యస్థాయిలో కనీసం 40,000 వరకు ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే కదా.
*
రానున్న
కొన్ని
త్రైమాసికాల్లో
దాదాపు
12,000
మందిని
తగ్గించుకోనున్నట్టు
కాగ్నిజెంట్
ఇప్పటికే
ప్రకటించింది.
మిగతా
కంపెనీలు
కూడా
ఇదే
స్థాయిలో
సిబ్బందిని
తగ్గించుకోవచ్చని
వర్గాలు
భావిస్తున్నాయి.
*
ఈ
ఏడాదిలో
ఉద్యోగుల
తగ్గింపు
50
వేలు
దాటవచ్చని
కూడా
అంటున్నారు.
కొత్త ఏడాది బాగుంటుందట
* మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలు తమ వ్యయాలను తగ్గించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. కాబట్టి ఎక్కువ వేతనం పొందుతున్న వారిని వదిలించుకోవాలనుకుంటున్నాయి. కొత్త నైపుణ్యాలు ఉన్న ఫ్రెషర్ల తక్కువ వేతనాలకు దొరుకుతున్న నేపథ్యంలో వీరిని నియమించుకోవడానికి కంపెనీలు పెద్ద పీట వేస్తున్నాయి. వచ్చే ఏడాదిలో ఫ్రెషర్ల నియామకాలు ఎక్కువగానే ఉంటాయంటున్నారు.
* ఒక్క మధ్య స్థాయి ఒక ఉద్యోగిని తీసి వేస్తే అతని స్థానంలో ముగ్గురు జూనియర్లను తీసుకోవచ్చన్న ఉద్దేశంతో కంపెనీలు ఉన్నాయట. అందుకే ఉద్యోగులను తగ్గించుకోవాలని కంపెనీలు భావిస్తున్నాయట.
నియామకాలు తగ్గక పోవచ్చు..
* కొంత మంది ఉద్యోగులను కంపెనీలు తగ్గించుకున్నా గ్లోబల్ దిగ్గజ కంపెనీలు మాత్రం ఉద్యోగులను పెంచుకునే అవకాశం ఉందని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు.
* ఎస్ఏపీ, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, గూగుల్ వంటి కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను పెంచుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.
వీటికి డిమాండ్
* కొత్త టెక్నాలజీలు నేర్చుకున్న వారిని కంపెనీలు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. ముఖ్యంగా పైథాన్, అంగ్యులర్ జావా, క్లౌడ్, ఆర్టిఫిషల్ ఇంటిలెజెన్స్ లేదా మెషిన్ లెర్న్ఇంగ్ వంటి ప్రోగ్రామ్స్ నేర్చుకున్న వారికి మంచి డిమాండ్ ఉంది.
కాబట్టి ఐటీ రంగంలో ఉన్న నిపుణులు తమ నైపుణ్యాలను ఎప్పటికి అప్పుడు మెరుగు పరచుకోవడమే కాకుండా కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడం వల్ల మంచి ఉద్యోగ అవకాశాలను సంపాదించుకునే అవకాశం ఉంటుందని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు.