న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థను తాము కాపాడామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం పరిశ్రమల సమాఖ్య అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (ASSOCHAM) యాన్యువల్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడారు. భారత్ 5ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా అడుగులు వేస్తోందన్నారు.

ప్రమాదంలో పడిన ఆర్థిక వ్యవస్థను కాపాడాం
ఐదారు సంవత్సరాల క్రితమే భారత ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడిందని, దానిని తమ ప్రభుత్వం కాపాడుకుందని మోడీ ప్రకటించారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా వెళ్తోందని, ఈ వృద్ధి ఇప్పటికి ఇప్పుడు వచ్చిందని, గత అయిదేళ్లుగా చేసిన కృషి ఫలితం అన్నారు. గత కొన్ని త్రైమాసికాలుగా జీడీపీ పడిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

అసాధ్యమని చెప్పారు కానీ...
తమ ప్రభుత్వం భారత ఆర్థిక వ్యవస్థ కునారిల్లకుండా కాపాడటమే కాకుండా, ఇండియన్ ఎకానమీలో క్రమశిక్షణను తీసుకు వచ్చిందన్నారు. తాము భారత దేశాన్ని డిఫెకేషన్గా చేయాలనుకున్నప్పుడు చాలామంది అది అసాధ్యమని చెప్పారని, దానిని సాధించి చూపించామని, ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ కూడా అంతే అన్నారు.

హఠాత్తుగా జరగదు
5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే హఠాత్తుగా జరగదని మోడీ అన్నారు. గత అయిదేళ్లలో భారత్ను మరింత స్ట్రాంగ్గా తయారు చేశామని చెప్పారు. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో లక్ష్యాలను చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశ్రమలోని డిమాండ్స్, లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కంపెనీలు కొన్ని గంటల్లో రిజిస్టర్ అవుతున్నాయన్నారు.

వారందరి గొంతూ విన్నాం
ప్రస్తుతం కేంద్రంలో రైతులు, కార్మికులు, పరిశ్రమలు, వ్యాపారులు... ఇలా అన్ని వర్గాల వారి సమస్యలు విని పరిష్కరించే ప్రభుత్వం ఉందని మోడీ అన్నారు. వారి సూచనలు, సలహాల మేరకు ముందుకు సాగే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. తాము జీఎస్టీని తీసుకు వచ్చామన్నారు. దానిని మెరుగుపరిచేందుకు వ్యాపారుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భారత్ ముందుకు వెళ్తోందన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications