న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ విలయాన్ని సృష్టిస్తోంది. పంజా విసురుతోంది. రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. కొద్దిరోజులుగా వరుసగా మూడున్నర లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగులోకి రాగా.. తాజాగా ఆ సంఖ్య నాలుగు లక్షల మార్క్ను దాటింది. కరోనా మరణాలు సైతం బెంబేలెత్తిస్తున్నాయి. రోజూ మూడువేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 3,523 మంది కరోనా బారిన పడి కన్నుమూశారు.

ఆక్సిజన్ అందక..
దేశంలో నమోదైన మొత్తం యాక్టివ్ కేసులు 33 లక్షలకు చేరువ అయ్యాయి. వాటి సంఖ్య 32,68,710కి చేరింది. ఒకేసారి ఇన్ని లక్షలమందికి వైద్యాన్ని అందించడానికి అవసరమైనన్ని మౌలిక సదుపాయాలు భారత్లో లేవనేది స్పష్టమౌతోంది. ఆసుపత్రుల్లో పడకలు దొరకట్లేదు. ఆక్సిజన్ అందక పదుల సంఖ్యలో కరోనా పేషెంట్లు తమ తుదిశ్వాసను విడుస్తున్నారు. కరోనా వల్ల కన్నుమూసిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు చేయడానిక్కూడా చోటు దొరకని దుస్థితి నెలకొంది. కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఇవే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

వాల్మార్ట్ ముందుకు..
దీన్ని చూసి చలించిన పలు దేశాలు భారత్కు సహాయాన్ని అందించడానికి ముందుకొస్తున్నాయి. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి అనేక దేశాలు ఆక్సిజన్ జనరేటర్లు, సిలిండర్లు, వెంటిలేటర్లు, ఐసీయూ పరికరాలను అందజేస్తున్నాయి. భారత్లో తమ కార్యకలాపాలను సాగిస్తోన్న కొన్ని బహుళజాతి సంస్థలు సైతం తమవంతు సహకారాన్ని అందించనున్నాయి. అమెరికాకు చెందిన చెయిన్ హైపర్ మార్కెట్ల సంస్థ, మల్టీనేషనల్ రిటైల్ కార్పొరేషన్ వాల్మార్ట్.. భారత్కు భారీ సహాయాన్ని ప్రకటించింది.

ఆక్సిజన్ జనరేటింగ్ ప్లాంట్లు..
20 ఆక్సిజన్ జనరేటింగ్ ప్లాంట్లు, అదే మొత్తంతో కూడిన క్రయోజనిక్ కంటైనర్లను విరాళంగా ప్రకటించింది. క్రయోజనిక్ కంటైనర్లు.. ఆక్సిజన్ను నిల్వ చేయడానికీ వాటిని రవాణా చేయడానికీ ఉపయోగపడతాయి. వాటితో పాటు 3000 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 500 ఆక్సిజన్ సిలిండర్లను భారత్కు అందజేస్తామని అమెరికా అర్కాన్సాస్లోని వాల్మార్ట్ ప్రధాన కార్యాలయం ప్రకటించింది. వాల్మార్ట్ ఫౌండేషన్ ద్వారా ప్రత్యేకంగా మరో 2,500 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందిస్తామని తెలిపింది.

రెండు మిలియన్ డాలర్ల మేర..
వాటి విలువ మొత్తం రెండు మిలియన్ డాలర్లుగా నిర్ధారించింది. ఇందులో ఒక మిలియన్ డాలర్ల మొత్తాన్ని వాల్మార్ట్ ఫౌండేషన్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ సూచించిన విధంగా డాక్టర్స్ ఫర్ యు, మరో మిలియన్ డాలర్లను గివ్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్కు అందజేస్తామని తెలిపింది. వాల్మార్ట్ కెనడా సైతం తమ పిలుపునకు స్పందించిందని, అంబులెన్సులు, పేషెంట్లను ఆసుపత్రులు, క్వారంటైన్ కేంద్రాలకు తరలించడానికి అవసరమైన అవసరమైన వాహనాలను కొనుగోలు చేయడానికి నిధులను కేటాయిస్తుందని, ఈ మొత్తాన్ని కెనడా రెడ్క్రాస్ సొసైటీకి అందజేస్తుందని అక్కడి నుంచి ఈ నిధులు భారత రెడ్క్రాస్ సొసైటీకి అందుతాయని వెల్లడించింది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!



Click it and Unblock the Notifications