Vedanta: బిలియనీర్ అనిల్ అగర్వాల్ కు చెందిన వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ ఓ కీలక ప్రకటన చేసింది. తమకు సంబంధించిన పెద్ద మొత్తం రుణాన్ని తిరిగి చెల్లించినట్లు పేర్కొంది. మొత్తం 800 మిలియన్ డాలర్ల విలువైన అప్పులు తీర్చినట్లు వెల్లడించింది. వడ్డీ రేట్లు పెరిగిన తర్వాత కంపెనీ లిక్విడిటీ గురించి ఆందోళన నెలకొన్న తరుణంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.
లండన్ కు చెందిన మూడు సంస్థలకు వేదాంత రుణాలు తిరిగి చెల్లించినట్లు తెలిపింది. వీటిని లండన్ మరియు హాంకాంగ్ లోని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ నుంచి తీసుకున్నట్లు కంపెనీ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో వివరించింది. ఈ రీపేమెంట్స్ వల్ల తమ అనుబంధ యూనిట్ వేదాంత లిమిటెడ్ షేర్లపై ఉన్న భారం కొంత మేరకు తీరినట్లయింది. గత నెలలోనూ చెల్లించాల్సిన అన్ని రుణాలు మరియు బాండ్లను పే చేసి, స్థూల రుణాన్ని 6.8 బిలియన్ డాలర్లకు తగ్గించుకుంది.

వేదాంత రిసోర్సెస్ దాని భారతీయ యూనిట్ల నుంచి రానున్న భారీ డివిడెండ్ లపై ఆధారపడింది. చెల్లింపు తేదీ దగ్గరపడిన రుణాల పేమెంట్స్ కోసం గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు మొత్తాలను తీసుకుంది. అయితే ఈ నెలలో డాలర్ నోట్లను ఎలా మేనేజ్ చేస్తుందోనని మార్కెట్ వర్గాలు గమనిస్తున్నాయి.
దీనికితోడు 2024లో మెచ్యూర్ కానున్న దాదాపు 2 బిలియన్ డాలర్ల బాండ్లు రూపంలో మరో పెద్ద రుణం రాబోతున్న తరుణంలో కంపెనీ ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయోనని పలువురు దృష్టి సారిస్తున్నారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications