IT News: ప్రస్తుతం ఐటీ కంపెనీల్లో కోల్డ్ వార్ నడుస్తోంది. ఉద్యోగులకు యాజమాన్యాలకు మధ్య ఇది గ్యాప్ పెంచుతోంది. ఇదే క్రమంలో అమెరికాకు చెందిన ప్రఖ్యాత టెక్ కంపెనీ సైతం జతకట్టింది. కరోనా తర్వాత పరిస్థితులు నార్మల్ అవుతాయని భావించిన కంపెనీలకు అనుకోని కష్టాలు వచ్చిపడ్డాయి.

ఆఫర్ లెటర్ల మాయ..
ఆర్థిక ప్రభావం ఉన్నప్పటికీ భారత్ లోని ఐటీ రంగం మాత్రం గత 3 ఏళ్లుగా అభివృద్ధి చెందుతూనే ఉంది. కానీ రష్యా-ఉక్రెయిన యుద్ధం ఐటీ రంగాన్ని పరోక్షంగా ప్రభావితం చేస్తోంది.ఇవిగో ఉద్యోగాలు అంటూ చేతిలో ఆఫర్ లెటర్లు పెట్టిన కంపెనీలు ఇప్పుడు వాటిని క్యాన్సిల్ చేసేస్తున్నాయి. అసలు ఎంపిక చేసుకున్న తర్వాత వారిని ఎందుకు పిలవటం లేదు..? భారతీయ ఐటీ కంపెనీలకు ఏమైంది..?

అమెరికా టెక్ దిగ్గజం..
కొత్త ప్రాజెక్ట్లకు గ్లోబల్ మందగమనం, ఇప్పటికే ఉన్న ప్రాజెక్ట్లలో తగినంత నగదు ప్రవాహ మార్జిన్ల కారణంగా భారతీయ ఐటీ కంపెనీలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. దీని వల్ల విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రాలు ఎంపిక చేసుకున్న ఉద్యోగులను సైతం తిరస్కరిస్తున్నాయి. అమెరికాకు చెందిన యాక్సెంచర్ సైతం క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా అక్టోబర్ 2021లో ఎంపిక చేసుకుంది. వివిధ కారణాల చేత వారికి అందించిన ఆఫర్ లెటర్లను కంపెనీలు రిజెక్ట్ చేస్తున్నాయి.

2023కు వాయిదా..
చాలా నెలల తర్వాత ఆన్బోర్డింగ్ లేకుండానే సెప్టెంబర్ 30 ఇచ్చిన లేఖలో వారి నియామకాన్ని 2023కి వాయిదా వేసింది. ఈ విషయంపై యాక్సెంచర్ కానీ, కళాశాలల యాజమాన్యాలు కానీ బాధ్యత స్వీకరించటానికి నిరాకరిస్తున్నారని బాధిత గ్రాడ్యుయేట్లు చెబుతున్నారు. ఇక విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, యాక్సెంచర్ కంపెనీల్లో చేరేందుకు తమ పాత కంపెనీని వదిలి వెళ్లిన చాలా మందికి ఇప్పుడు ఉద్యోగం లేకుండా పోవడం బాధాకరం.

Google, Meta, Microsoft
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గడ్డు పరిస్థితుల కారణంగా కేవలం భారతీయ ఐటీ కంపెనీలకే కాక.. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు సైతం ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ కంపెనీలు కొత్త ఉద్యోగుల నియామకాన్ని పూర్తిగా నిలిపివేశాయి. మరికొన్ని కంపెనీలు ఇప్పటికే ఉన్న ఉద్యోగులను రీఆర్గనైజ్ చేసి తొలగిస్తున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..



Click it and Unblock the Notifications