భారత్పై అమెరికా ప్రతీకార చర్య, డిజిటల్ ట్యాక్స్కు బదులు వస్తువులపై పన్ను
భారత్తో పాటు ఇటలీ, టర్కీ, బ్రిటన్, స్పెయిన్ తదితర దేశాలపై ప్రతీకార వర్తక చర్యలకు అమెరికా సిద్ధమవుతోంది. ఈ-కామర్స్ సేవలపై ఈ దేశాలు పన్ను విధించడాన్ని అమెరికా వ్యతిరేకిస్తోంది. ఇందుకుబదులుగా ప్రతీకార వర్తక చర్యలను యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్(USTR) ప్రతిపాదించారు. ఇండియా డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్ పైన యూఎస్ ట్రేడ్ యాక్ట్లోని 301 సెక్షన్ కింద గత ఏడాది జూన్ నెలలో అమెరికా విచారణ చేపట్టింది. ఈ వ్యవహారం అమెరికా డిజిటల్ సేవల కంపెనీలపై పక్షపాతం చూపించేందిగా ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ చేశారు.
ఈ వాదనను భారత ప్రభుత్వం వ్యతిరేకించింది. అయినా ప్రతికార చర్యలకే అమెరికా సిద్ధమవుతోంది. విచారణలో తేలిన అంశాల ఆధారంగా 301 సెక్షన్ కింద అమెరికా USTR ప్రతీకార చర్యలను ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. దీని ప్రకారం మన దేశం నుండి అమెరికాకు ఎగుమతయ్యే చేపలు, రొయ్యలు వంటి సముద్ర ఉత్పత్తులు, వెదురు, వజ్రాలు-రత్నాలు, ఫర్నీచర్, సిగరేట్ పేపర్ వంటి ఉత్పత్తులపై అదనంగా యాడ్ వెలారమ్ పన్నులు విధించే అవకాశముంది.
అమెరికా కంపెనీల నుండి మన దేశం ఎంతమేరకు డిజిటల్ సర్వీసెస్ టాక్స్ వసూలు చేస్తుందో దాదాపు అంతే మొత్తాన్ని మనదేశం నుండి వచ్చే వస్తువులపై పన్ను రూపంలో వసూలు చేయాలని అమెరికా భావిస్తోందట. అంచనాల ప్రకారం మనదేశంలో అమెరికా కంపెనీల నుండి వసూలు చేసే DST ప్రతి సంవత్సరం 5.5 కోట్ల డాలర్ల మేరకు ఉంటుందని అంచనా.