8th Pay Commission: 8వ వేతన సంఘంపై కీలక ప్రకటన.. డీఏ పెంపుపై కుండబద్ధలు కొట్టిన కేంద్ర మంత్రి..
8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘం ఏర్పాటు చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభలో వెల్లడించారు. "కేంద్ర ఉద్యోగుల కోసం 8వ కేంద్ర వేతన సంఘం రాజ్యాంగం కోసం ప్రభుత్వం వద్ద అటువంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదు" అని చౌదరి ఒక ప్రశ్నకు వ్రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఇది జనవరి 1, 2026 నుంచి అమలు చేసే అవకాశం ఉందని తెలిపారు.
కరువు భత్యంపై వివరణ..
ద్రవ్యోల్బణం కారణంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు జీతం తర్వాత డియర్నెస్ అలవెన్స్ ఇస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి అన్నారు. ద్రవ్యోల్బణం రేటుపై ఆధారపడి ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకోసారి డీఏ రేటును సవరిస్తూ ఉంటుంది. 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని కుండబద్దలుకొట్టి చెప్పారు. ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు.
ఏడవ వేతన సంఘం..
2014 ఫిబ్రవరిలో ప్రభుత్వం 7వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది. ప్యానెల్ సిఫార్సులు జనవరి 1, 2016 నుంచి అమలులోకి వస్తాయి. కేంద్ర ఉద్యోగులకు డీఏ రేటు ప్రకారం డియర్నెస్ అలవెన్స్ కొనసాగుతుందని ప్రభుత్వం చెబుతోంది.
అసలు పే కమిషన్ అంటే ఏమిటి?
పే కమిషన్ అనేది ప్రభుత్వ ఉద్యోగుల వేతన నిర్మాణంలో మార్పులను సిఫారసు చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ. దీనిని మొదట జనవరి 1946లో ఏర్పాటు చేశారు. శ్రీనివాస్ వరదాచారి అధ్యక్షతన కమిషన్ తన నివేదికను మే 1947లో అప్పటి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.
పే కమిషన్ ఎలా పనిచేస్తుంది?
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిషన్ తన సిఫార్సులను సమర్పించడానికి సాధారణంగా 18 నెలల సమయం ఇస్తారు. ఇది భారత ప్రభుత్వ పౌర, సైనిక విభాగాలకు సంబంధించిన వేతన నిర్మాణాన్ని(Salary Structure) సమీక్షిస్తుంది. దీని ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీలో ఉంది. ఈ కమిటీ చేసే సిఫార్సులు ద్రవ్యోల్బణంతో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. డియర్నెస్ అలవెన్స్ (DA), ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అండ్ బేసిక్ పే కమిషన్ నివేదికలో చర్చిస్తారు.