DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. డీఏ పెంపు ప్రకటించిన 7వ వేతన సంఘం.. ఇక పండగే..
7th Pay Commission: దసరాకు ముందే ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ వచ్చేసింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపు నిర్ణయం ప్రకటించటంతో అంతటా సంతోషం నెలకొంది. 7వ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల డియర్నెస్ అలవెన్స్ పెంచినట్లు ప్రకటించింది. డీఏను 4 శాతం పెంచినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సెప్టెంబర్ 28న ప్రకటించారు. ఈ పెంపుతో డీఏ ప్రస్తుతం ఉన్న 34 శాతం నుంచి 38 శాతానికి పెరిగింది.
లక్షల మందికి ప్రయోజనం..
డీఏ పెంపు ప్రకటన వల్ల 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు, 62 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనున్నట్లు కేంద్ర మంత్రి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల పండుగకు ముందుగానే ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు. డీఏను 3 శాతం పెంచేందుకు మార్చిలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది, తద్వారా డీఏను ప్రాథమిక ఆదాయంలో 34 శాతానికి తీసుకుంది.
DA అంటే ఏమిటి..?
డియర్నెస్ అలవెన్స్ (DA) అనేది ప్రభుత్వ రంగ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లిస్తున్న జీవన వ్యయ సర్దుబాటు భత్యం. దీనినే కరవు భత్యం అని కూడా పిలుస్తుంటారు. ప్రభుత్వం సాధారణంగా ప్రతి ఆరు నెలలకోసారి డీఏ రేటును సవరిస్తుంది. ద్రవ్యోల్బణం కారణంగా నెలవారీ జీతం/పెన్షన్ కొనుగోలు శక్తిలో నష్టాన్ని భర్తీ చేయడానికి ఇది జరుగుతుంది.
డీఏ ఎలా లెక్కించబడుతుంది?
2006లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్లను లెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్ములాను సవరించింది. దీని ప్రకారం కరువు భత్యాన్ని కింద వెల్లడించిన విధంగా లెక్కించటం జరుగుతుంది.
* డియర్నెస్ అలవెన్స్ శాతం = ((ఆల్-ఇండియా వినియోగదారుల ధరల సూచిక (ఆధార సంవత్సరం 2001=100) గత 12 నెలల సగటు -115.76)/115.76)x100.
* కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగుల కోసం: డియర్నెస్ అలవెన్స్ శాతం = ((ఆల్-ఇండియా వినియోగదారుల ధరల సూచీ (ఆధార సంవత్సరం 2001=100) గత 3 నెలలుగా -126.33)/126.33)x100.