భారత బ్యాంకులకు వేలకోట్లు కుచ్చుటోపీ పెట్టి లండన్లో తలదాచుకుంటున్న కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా అప్పగింతపై భారత ప్రభుత్వం.. సుప్రీం కోర్టుకు కీలక విషయాన్ని తెలిపింది. మాల్యా అప్పగింత కుదరదని బ్రిటన్ ప్రభుత్వం చెప్పినట్లు భారత అత్యున్నత న్యాయస్థానానికి వెల్లడించింది. రహస్య న్యాయపర చిక్కులు తొలగిపోయే వరకు భారత్కు అప్పగించలేమని బ్రిటన్ చెప్పిందని తెలిపింది.
జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట బ్రిటన్ తమకు పంపిన లేఖను కేంద్రం తరఫు న్యాయవాది చదివి వినిపించారు. అయితే తదుపరి న్యాయపరమైన అంశాలు పరిష్కారమయ్యే వరకు మాత్రమే అప్పగించడం కుదరదని బ్రిటన్ తెలిపింది. న్యాయపరమైన అంశాలు తేలాక అప్పగించే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే భారత ప్రభుత్వం ఈ మార్గంలో రప్పించే ప్రయత్నాలు చేస్తోంది.

సాధ్యమైనంత వేగంగా ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు ప్రయత్నిస్తామని బ్రిటన్ చెప్పినట్లు కేంద్రం తెలిపింది. అనంతరం మాల్యాను భారత్ రప్పించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను అటార్నీ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకు వివరించారు. వాదనలు విన్న అనంతరం ఈ కేసు విచారణను మార్చి 15కు వాయిదా వేశారు.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications