ఇండియన్ బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టి లండన్లో తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు యూకే కోర్టులో ఊరట లభించింది. మాల్యాను దివాళా తీసిన వ్యక్తిగా ప్రకటించడం ద్వారా తమకు చెల్లించాల్సిన రూ.9వేల కోట్లను రాబట్టుకునే వీలు కల్పించాలని SBI నేతృత్వంలోని ఇండియన్ బ్యాంకుల కన్సార్టియం లండన్ కోర్టును అభ్యర్థించింది. దీనిపై వాదనలు విన్న లండన్ కోర్టు.. మాల్యాకు ఊరటను ఇచ్చే తీర్పు చెప్పింది.

మాల్యాకు కాస్త సమయం ఇవ్వాలి
భారత సుప్రీం కోర్టు, కర్ణాటక హైకోర్టులో పెండింగులో ఉన్న పలు పిటిషన్లను పరిగణలోకి తీసుకొని బ్యాంకులకు తిరిగి చెల్లించేందుకు విజయ్ మాల్యాకు కాస్త సమయం ఇవ్వాలని లండన్ కోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి పరిస్థితుల్లో మాల్యాపై తక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా బ్యాంకులకు ఎలాంటి ప్రయోజనం లేదా లాభం ఉండబోదని తెలిపింది.

వాయిదా వేస్తే తిరిగి చెల్లించే అవకాశం
భారత్లో పలు కేసులు విచారణలో ఉన్న సమయంలో బ్యాంకులు కోరుతున్నట్లుగా దివాళాగా ప్రకటించడం అసాధారణమని తెలిపింది. కొంతకాలం పాటు దీనిని వాయిదా వేయడం వల్ల సదరు వ్యక్తి బ్యాంకులకు తిరిగి చెల్లించే అవకాశం ఉంటుందని జస్టిస్ మైఖేల్ బ్రిగ్స్ తన తీర్పులో తెలిపారు. దీనిపై గత ఏడాది డిసెంబర్ నెలలో యూకే కోర్టు వాదనలు విన్నది. తాజాగా గురువారం తీర్పు చెప్పింది.

కరోనా ప్రభావం
ఈ దివాలా పిటిషన్ అసాధారణమైనదని, భారత్లో విస్తృతమైన చర్యలకు ఆస్కారం ఉన్న సమయంలో బ్యాంకులు దివాళా ఉత్తర్వుల కోసం ఒత్తిడి చేస్తున్నాయని తీర్పులో జడ్జి పేర్కొన్నారు. విచారణను 1 జూన్ 2020 తర్వాత చేపట్టేందుకు పార్టీలు అంగీకరించాయని, కరోనా మహమ్మారి కారణంగా తేదీని నిర్ణయించడం ఇబ్బందికరంగా మారిందని జడ్జి తెలిపారు.

గతంలో...
గతంలో విచారణ నిమిత్తం భారత్కు మాల్యాను అప్పగించే విషయమై సానుకూలంగా కోర్టు తీర్పు చెప్పింది. దీనిని పైకోర్టులో సవాల్ చేసేందుకు మాల్యాకు యూకే కోర్టు అవకాశం కల్పించింది. ఇండియన్ బ్యాంకులకు రూ.9వేల కోట్లకు పైగా మోసం చేయడంతో పాటు మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నరు మాల్యా.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications