ఇంధన ధరలు రోజురోజుకు పెరుగుతోన్న విషయం తెలిసిందే. కరోనా-లాక్ డౌన్ కారణంగా దాదాపు మూడు నెలల పాటు ధరల్లో మార్పు లేదు. జూన్ 7వ తేదీ నుండి చమురు రంగ సంస్థలు ధరలను సమీక్షించడం ప్రారంభించాయి. ఈ నెల రోజుల్లో దాదాపు రూ.10 వరకు పెరిగాయి. ఇంధన ధరలు పెరగడంతో ఆ భారం వాహనదారులతో పాటు వివిధ వస్తువుల వినియోగదారులపై కూడా పడనుంది. ఎందుకంటే సరఫరా చేసే ట్రక్ యజమానులు ధరలు పెంచుతున్నారు.

25 శాతం వరకు పెరుగుదల
పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి తోడు కరోనా కారణంగా మ్యాన్ పవర్ కొరత ఉండటంతో ట్రక్ యజమానుల కార్యకలాపాల ఖర్చులు పెరుగుతున్నాయి. దీంతో వారు కూడా ధరలను 20 శాతం నుండి 25 శాతం మేర పెంచనున్నారు. ఓ వైపు డిమాండ్ లేమి కారణంగా టారిఫ్ హైకింగ్కు ప్రస్తుతం అనుకూలంగా కనిపించడం లేదు. కానీ పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా పెంచే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ఇక ధరలు పెంచుతున్నాం..
ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా కోలుకుంటున్నాయి. పరిశ్రమలు క్రమంగా ఉత్పత్తిని పెంచుతున్నాయి. దీంతో రవాణాకు కూడా అదే విధంగా డిమాండ్ పెరుగుతోంది. కానీ రికార్డ్ స్థాయికి చేరుకుంటున్న ఇంధన ధరల కారణంగా రవాణా పరిశ్రమపై రెట్టింపు ప్రభావంపడింది. ఇప్పటికే పలుచోట్ల ట్రాన్సుపోర్టర్స్ అండ్ ట్రక్కర్స్ అసోసియేషన్ సంఘాలు ధరలను 20 శాతం నుండి 25 శాతం పెంచుతున్నట్లు తమ కస్టమర్లకు ప్రతిపాదనలు పంపించాయట.

దెబ్బ మీద దెబ్బ
ఇండోర్కు చెందిన ట్రాన్సుపోర్టర్ రాకేష్ తివారీ మాట్లాడుతూ.. డీజిల్ ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయని, దీంతో తాము 25 శాతం టారిఫ్ హైక్ను కోరుతున్నామని, ఎందుకంటే నష్టాలలో కార్యకలాపాలు నిర్వహించలేమని చెప్పారు. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా బిజినెస్ లేదని, ఇప్పుడు డీజిల్ ధరలు పెరగడంతో తమ వ్యాపారంపై మరింత దెబ్బపడిందన్నారు.

వారికి ఇష్టం లేదు..
ఇండోర్ మధ్యప్రదేశ్లో ప్రధాన వాణిజ్య కేంద్రం. వేలాది ట్రక్కులు ఇక్కడి నుండి సరఫరా చేస్తాయి. ఇక్కడ పెద్ద ఎత్తున చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSME) ఉన్నాయి. లాక్ డౌన్ సంక్షోభం తర్వాత ధరల పెరుగుదల ప్రభావం చూపుతోందని కాబట్టి నష్టాలతో వ్యాపారం చేయలేమని, అందుకే టారిఫ్స్ పెంచుతున్నారని, మరోవైపు వినియోగదారులు కూడా డిమాండ్ లేని కారణంగా సుంకాలు పెంచేందుకు ఆసక్తి చూపించరని, ఇది ఇబ్బందికరమేనని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్సుపోర్ట్ కాంగ్రెస్ వెస్ట్ జోన్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ కల్రా చెప్పారు.

ఇప్పుడిప్పుడే రోడ్డెక్కుతున్నాయి
గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీస్, వ్యవసాయ ఉత్పత్తులు, ఎడిబుల్ ఆయిల్స్, నిత్యావసర వస్తువుల ఉత్పత్తి పెరిగిందని, డిమాండ్ కూడా పెరిగిందని, దీంతో 50 శాతం ట్రక్కులకు డిమాండ్ ఉందని చెబుతున్నారు. అలాగే తమ అద్దెలు కూడా పెరిగాయని రిటైల్ ట్రాన్సుపోర్టర్ ప్రవీణ్ అగర్వాల్ అన్నారు. చాలామంది కానీ కస్టమర్లు ధరలు పెంచేందుకు సిద్ధంగా లేరన్నారు. ట్రాన్సుపోర్టర్స్ తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
More From GoodReturns

Iran war: కేవలం గ్యాస్ ఒక్కటే కాదు.. ఈ 5 రంగాలపై భారీ ఎఫెక్ట్ ఉండే అవకాశం?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications