ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగం జియో ప్లాట్ఫాంలోకి మరో భారీ పెట్టుబడి వచ్చింది. రెండు నెలల లోపు (7 వారాల్లో) ఇది తొమ్మిదో పెట్టుబడి. అమెరికా ప్రయివేటు ఈక్విటీ కంపెనీ టీపీజీ రూ.4,564.80 కోట్ల పెట్టుబడితో జియో ప్లాట్ఫామ్స్లో 0.93 శాతం వాటాను కొనుగోలు చేస్తోంది. ఈక్విటీ వ్యాల్యూ రూ.4.91 లక్షల కోట్లు, ఎంటర్ప్రైజ్ వ్యాల్యూ రూ.5.16 లక్షల కోట్ల వద్ద ఈ డీల్ కుదిరింది.
ఈ పెట్టుబడితో జియో మొత్తం రూ.102,432.15 సమీకరించింది. టీపీజీ క్యాపిటల్-రిలయన్స్ మధ్య పెట్టుబడుల అంశంపై చర్చలు సాగుతున్నాయని, త్వరలో ప్రకటన వెలువడనుందని రెండు రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. ఇప్పుడు డీల్పై ప్రకటన వచ్చింది. ఇప్పటికే అమెరికాకు చెందిన కేకేఆర్, సిల్వర్ లేక్, జనరల్ అట్లాంటింక్ ఇన్వెస్ట్ చేశాయి.

టీపీజీకి ముందు . జియో ప్లాట్ఫాంలోకి రూ.97,885.65 కోట్లు లేదా 13 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఏడు వారాల్లో 8 కంపెనీలు 21 శాతం వాటాను దక్కించుకున్నాయి. ఫేస్బుక్తో ఈ పెట్టుబడుల వెల్లువ ప్రారంభమైంది. ఆ తర్వాత సిల్వర్ లేక్ పార్ట్నర్స్, విస్టా ఈక్విటీ పార్ట్నర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, ముబాదాల, సిల్వర్ లేక్ (రెండోసారి), ఏడీఏఐలు పెట్టుబడి పెట్టాయి.
ఇప్పటి వరకు వచ్చిన పెట్టుబడులు...
- ఫేస్బుక్ - రూ.43,573.62 కోట్లు - 9.99 శాతం వాటా
- సిల్వర్ లేక్ పార్ట్నర్స్ - రూ.5,655.75 కోట్లు - 1.15 శాతం వాటా
- విస్టా ఈక్విటీ పార్ట్నర్స్ - రూ.11,367.00 కోట్లు - 2.32 శాతం వాటా
- జనరల్ అట్లాంటిక్ - రూ.6,598.38 కోట్లు - 1.34 శాతం వాటా
- కేకేఆర్ - రూ.11,367.00 కోట్లు - 2.32 శాతం వాటా
- ముబాదాల - రూ.9,093.60 కోట్లు - 1.85 శాతం వాటా
- సిల్వర్ లేక్ (రెండోసారి) - రూ.4,546.80 కోట్లు - 0.93 శాతం వాటా
- ADIA - రూ.5,683.50 కోట్లు - 1.16 శాతం వాటా
- TPG (తాజా పెట్టుబడి) - రూ.4,546.8 కోట్లు - 0.93 శాతం వాటా
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications