కరోనా నేపథ్యంలో భారత ప్రభుత్వం 130 కోట్లకు పైగా ఉన్న ప్రజల కోసం వ్యాక్సినేషన్ డ్రైవ్ను ప్రారంభించింది. ప్రతిరోజు లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల రికవరీ వేగంగా పెరుగుతోంది. వివిధ రాష్ట్రాల్లో లాక్డౌన్, కరోనా కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. తొలుత ఫ్రంట్ లైన్ వారియర్స్కు, వృద్ధులకు, 45 ఏళ్లు పైబడిన వారికి, ఇప్పుడు 18 ఏళ్లు, అంతకుమించిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. దేశంలోని ప్రజలందరికీ వ్యాక్సినేషన్ కోసం లక్షల కోట్లు ఖర్చవుతోంది.

రూ.3.7 లక్షల కోట్ల ఖర్చు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎకనమిక్ వింగ్ సర్వే నివేదిక ప్రకారం వ్యాక్సినేషన్, పంపిణీ కోసం రూ.3.7 లక్షల కోట్ల మేర ఖర్చు అవుతుందని అంచనా. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యే నాటికి దాదాపు ఈ మొత్తం కావొచ్చు. మరో విషయం ఏమంటే ఇది కూడా కేవలం 20 రాష్ట్రాల ఖర్చు మాత్రమే. అత్యధిక జనాభాతో కూడిన పేద రాష్ట్రాలు తమ ప్రజలకు వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టే పరిస్థితుల్లో ఉండవని, సంపన్న రాష్ట్రాలు గ్లోబల్ మార్కెట్లో వ్యాక్సినేషన్ కోసం అధిగ ధరలను వెచ్చించవలసి వస్తోందని పేర్కొంది.

వ్యాక్సీన్కు ఖర్చు...
రాష్ట్రాలకు అవసరమైన వ్యాక్సిన్లలో 50 శాతం కేంద్రం సమకూరుస్తుందని అంచనా వేస్తూ సిక్కిం ఒక్కో వ్యాక్సిన్కు 5 డాలర్ల చొప్పున ఖర్చు చేసినా రూ.20 కోట్లు వెచ్చించాల్సి వస్తుందని ఈ నివేదిక తెలిపింది. ఇక ఉత్తర ప్రదేశ్లో వ్యాక్సినేషన్ కోసం రూ.67,100 కోట్లు ఖర్చు చేయవలసి ఉంటుందని తెలిపింది. ప్రజలకు త్వరగా వ్యాక్సినేషన్ ఇవ్వడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సమీకరించాలని సూచించింది. అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ వ్యయం ఒకేలా ఉండేలా చూడాలని పేర్కొంది.

ఆర్థిక వ్యవస్థపై దెబ్బ
కరోనా వ్యాక్సినేషన్కు రూ.3.7 లక్షల కోట్లు కావడంతో పాటు, జూన్ చివరి నాటికి కరోనా లాక్ డౌన్, ఆంక్షల వల్ల భారత ఎకానమీకి రూ.5.5 లక్షల కోట్ల మేర దెబ్బపడుతుందని ఈ నివేదిక తెలిపింది. భారత్ వద్ద 28 మిలియన్ డోసుల కరోనా వ్యాక్సీన్ ఉందని, మరో 2.14 డోసులు ఆగస్ట్-డిసెంబర్ కాలానికి వస్తాయని వెల్లడించింది. ఉత్తర ప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాలు గ్లోబల్ టెండర్స్ పిలిచాయని తెలిపింది. దేశంలో 187 మిలియన్ల మందికి వ్యాక్సినేషన్ వేశారని, ప్రతి 100 మందిలో ఇది 13.8 అని తెలిపింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications