Demonetisation: నోట్ల రద్దుతో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయి.. సుప్రీంకు తెలిపిన కేంద్రం..
నవంబర్
2016లో
డీమోనిటైజేషన్
అనేది
డిజిటల్
లావాదేవీలలో
వృద్ధికి
దారితీసిందని
కేంద్ర
ఆర్థిక
మంత్రిత్వ
శాఖ
బుధవారం
సుప్రీంకోర్టుకు
తెలిపింది.
అదే
విధంగా
నకిలీ
కరెన్సీని
కూడా
తగ్గించిందని,
ఎక్కువ
మంది
ఆదాయపు
పన్ను
చెల్లించేందుకు
దోహదపడిందని
వివరించింది.
ఆ
సమయంలో
చలామణిలో
ఉన్న
కరెన్సీలో
80%
కంటే
ఎక్కువ
రూ.500,రూ.1000
నోట్ల
ఉపసంహరణ
జరిగిందని
పేర్కొంది.డీమోనిటైజేషన్
తర్వాత,
డిజిటల్
చెల్లింపు
లావాదేవీల
పరిమాణం
2016లో
రూ.6,952
కోట్ల
విలువైన
1.09
లక్షల
లావాదేవీల
నుంచి
ఒక్క
నెలలో
రూ.12
లక్షల
కోట్ల
కంటే
ఎక్కువ
విలువైన
730
కోట్ల
లావాదేవీలకు
పెరిగిందని
మంత్రిత్వ
శాఖ
తెలిపింది.
ఈ మేరకు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. అంతేకాకుండా నవంబర్ 9 డిసెంబరు 30, 2016 మధ్య జరిగిన బ్యాంక్ ఖాతా డిపాజిట్లపై నిశిత దృష్టిని ఉంచిన ఆదాయపు పన్ను అధికారులు లెక్కల్లో చూపని ఆదాయాన్ని' గుర్తించారని వివరించింది. 2016 నాటి నోట్ల రద్దును ప్రభుత్వం సమర్థించింది. 2016లో డీమోనిటైజేషన్ రన్-అప్ గురించి మంత్రిత్వ శాఖ వివరించింది. అంతకుముందు ఐదేళ్లలో రూ.500 రూ.1,000 నోట్ల చెలామణిలో "భారీ పెరుగుదల" కనిపించిందని తెలిపింది.
"రూ.500కి 76.4%, 109% బాగా పెరిగిందని వివరించింది. నోట్ల రద్దు అనంతర రోజుల్లో బ్యాంకు ఖాతాల నుంచి నగదు ఉపసంహరణలపై ఈ పరిమితులు దారితీశాయని పేర్కొంది. అయితే ఈ ఆంక్షలు కేవలం నగదు ఉపసంహరణలకు మాత్రమేనని, చెక్కులు, కార్డులు, మొబైల్ బ్యాంకింగ్ మొదలైన వాటి ద్వారా జరిగే లావాదేవీలకు కాదని ప్రభుత్వం పేర్కొంది.