కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు మరింత ఊరట కలిగించే నిర్ణయాన్ని తీసుకుంది. గత కొన్ని రోజులుగా వంటనూనెల ధరలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో సామాన్య మధ్యతరగతి కుటుంబాల వారు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక తాజాగా దిగుమతి చేసుకున్న ముడి పామాయిల్పై వ్యవసాయ మౌలిక సదుపాయాలు మరియు అభివృద్ధి సెస్ను కేంద్ర ప్రభుత్వం మరింత తగ్గించింది . గత అక్టోబర్లో ఎడిబుల్ ఆయిల్లపై ప్రకటించిన కస్టమ్స్ డ్యూటీ మరియు సెస్ రిలీఫ్ను సెప్టెంబర్ 2022 చివరి వరకు పొడిగించింది. ఇక ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా వంటనూనె ధరలు నియంత్రించడంతో పాటు దేశీయ ప్రాసెసింగ్ కంపెనీలకు మద్దతునిస్తోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ముడి పామాయిల్ పై దిగుమతి సుంకాన్ని తగ్గించిన కేంద్రం
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ మరియు కస్టమ్స్ (CBIC) నుండి అధికారిక ఉత్తర్వు ప్రకారం గత అక్టోబర్లో ప్రకటించిన ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ రిలీఫ్ 2022 మార్చి చివరి నాటికి ముగుస్తుంది. అయితే దానిని పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఇది సెప్టెంబర్ చివరి వరకు అందుబాటులో ఉంటుంది.దిగుమతి చేసుకున్న ముడి పామాయిల్పై వ్యవసాయ మౌలిక సదుపాయాలు మరియు అభివృద్ధి సెస్ను గత ఏడాది 20% నుండి 7.5% కి తగ్గించారు. ఆదివారం నుండి 5% కి తగ్గించారు.

ఎడిబుల్ ఆయిల్స్పై సుంకం రాయితీని పొడిగించిన కేంద్రం
అంతేకాకుండా, కందిపప్పు విషయంలో, దిగుమతులపై ఎటువంటి సెస్ ఉండదు. డిసెంబరు నెలలో నివేదించబడిన 'నూనెల' విషయంలో సంవత్సరానికి 24% పైగా ద్రవ్యోల్బణం నేపథ్యంలో, ఎడిబుల్ ఆయిల్స్పై సుంకం రాయితీని పొడిగించడం మరియు పామాయిల్ దిగుమతులపై వ్యవసాయ సెస్ని తగ్గించడం జరిగింది. గత డిసెంబర్లో మొత్తం వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.59%గా ఉంది. నవంబర్లో 4.91%తో పోలిస్తే ఎక్కువగా ఉంది.

సెప్టెంబర్ చివరి వరకు కొనసాగనున్న సుంకం రాయితీలు
క్రూడ్ పామాయిల్, క్రూడ్ సోయాబీన్ ఆయిల్ మరియు క్రూడ్ సన్ఫ్లవర్ సీడ్ ఆయిల్పై గతేడాది ప్రకటించిన ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ రిలీఫ్-2.5% నుంచి సున్నాకి చేసిన తగ్గింపు ఇప్పుడు సెప్టెంబర్ చివరి వరకు కొనసాగుతుంది. ప్రభుత్వం డిసెంబర్లో శుద్ధి చేసిన పామాయిల్ మరియు దాని భిన్నాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 17.5% నుండి 12.5%కి తగ్గించింది. ఇది కూడా సెప్టెంబర్ చివరి వరకు కొనసాగుతుంది.

ముడి నూనెల వ్యవసాయ సెస్పై ఉపశమనం
అలాగే, ముడి సోయా-బీన్ నూనె మరియు ముడి పొద్దుతిరుగుడు నూనె రెండింటిపై వ్యవసాయ సెస్పై ఉపశమనం-20% నుండి 5% వరకు తగ్గింపు ఇచ్చింది. ఇది సెప్టెంబర్ చివరి వరకు అమలులో ఉంటుంది. ఈ చర్య దేశీయ రిటైల్ ధరలను తగ్గించి వినియోగదారులకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఎడిబుల్ ఆయిల్ ధరలు అధికంగా ఉంటే దేశీయ వంటనూనెల ధరలపై గణనీయమైన ప్రభావం చూపుతాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications