అమెరికా ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్ కర్ణాటకలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఈ కంపెనీ భారత్లో ఓ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఇది కర్ణాటకకు రానుందని వార్తలు వచ్చాయి. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. 2021 జనవరిలోనే టెస్లా కర్ణాటకలో తమ సంస్థ పేరును నమోదు చేసుకుంది. టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రయివేట్ లిమిటెడ్ పేరుతో ఓ అనుబంధ సంస్థను నమోదు చేసుకుంది.
యడ్యూరప్ప మాట్లాడుతూ.. టెస్లా కర్ణాటకలో తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుందని, తుమకూర్ జిల్లాలో రూ.7775కోట్లతో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కాగా, బెంగళూరులో ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఈ కంపెనీ సన్నాహాలు చేస్తోందని, టెస్లా ఇండియా డైరెక్టర్లుగా వైభవ్ తనేజా, శ్రీరామ్, డేవిడ్ జాన్ను ప్రకటించిందని వార్తలు వచ్చాయి.

భారత్లో తన వ్యాపారానికి అవసరమైన పెట్టుబడులు ఎక్కడి నుండి వస్తే లాభమో చూసుకొని, నెదర్లాండ్స్ను ఎంచుకున్నారు టెస్లా అధినేత ఎలాన్ మస్క్. ఇటీవల భారత్లో ఎలాన్ మస్క్ రిజిస్టర్ చేసిన టెస్లా మోటార్స్ అండ్ ఎనర్జీ ఇండియాకు నెదర్లాండ్స్లోని టెస్లా మోటార్స్ నెదర్లాండ్స్ మాతృసంస్థగా వ్యవహరిస్తుంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications