పాకిస్తాన్ కొత్త సోషల్ మీడియా నిబంధనలపై అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ బుధవారం చట్ట విరుద్ధమైన ఆన్లైన్ కంటెంట్ ( ప్రొసీజర్, ఓవర్ నైట్ సేఫ్ గార్డ్స్) రూల్స్ (RBUOC) 2020 ప్రకారం తొలగించడం, బ్లాక్ చేయడంపై కొత్తగా ఆదేశాలు జారీ చేసింది. ఈ రూల్స్ను ప్రివెన్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ క్రైమ్ యాక్ట్ 201(PECA) కింద సిద్ధం చేశారు. RBUOC నిబంధనలు కఠినంగా ఉన్నాయి. ఈ నిబంధనల ప్రకారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని అంశాలు ISP(ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు) వర్తింపచేయబడ్డాయి. ఇది టెక్ దిగ్గజాలకు ఆగ్రహం కలిగించింది.

టెక్ దిగ్గజాల హెచ్చరిక
పాక్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన సోషల్ మీడియా నిబంధనలు ఆసియా ఇంటర్నెట్ కొలేషన్ (AIC)కి ఆగ్రహం తెప్పించింది. AICలో ఫేస్బుక్, గూగుల్, ట్విట్టర్ సహా మరికొన్ని సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వం తాజా నిబంధనలు సమీక్షించాలని లేదంటే ఇంటర్నెట్ సేవలు కొనసాగించడం కష్టతరం అవుతుందని చెబుతున్నాయి. నిబంధనలు సమీక్షించకుంటే సేవలను నిలిపివేయాల్సి వస్తుందని కూడా హెచ్చరించాయి. పాక్ కొత్త నిబంధనలు చాలా ఆందోళకరంగా ఉన్నట్లు తెలిపింది.

కొత్త నిబంధనలు ఇవీ...
పాక్ కొత్త నిబంధనల ప్రకారం సోషల్ మీడియా, ఇంటర్నెట్ సేవలు అందించే సంస్థలపై నియంత్రణ కోసం సంబంధిత అధికార యంత్రాంగానికి అధికారాలు కట్టబెట్టింది. మతం, ఉగ్రవాదం, అశ్లీలం, విద్వేషాలు, రెచ్చగొట్టే సమాచారాన్ని నిలువరించడంలో సోషల్ మీడియా కంపెనీలు నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే 3.14 మిలియన్ డాలర్ల జరిమానా విధించేందుకు ప్రభుత్వం అనుమతించింది.
ప్రభుత్వం అడిగితే ఏ సమాచారాన్ని అయినా సోషల్ మీడియా సంస్థలు పూర్తి వివరాలు అందించాలి. అభ్యంతరం చెప్పిన కంటెంట్ను 24 గంటల్లో తొలగించాలి. ఇస్లామాబాద్లో కార్యాలయాలు ఏర్పాటు చేసి, అక్కడే డేటా సర్వర్లను ఉంచాలి. పాకిస్తాన్లో 50,000 మంది యూజర్ల కంటే ఎక్కువ ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లేదా పాక్ టెలి కమ్యూనికేషన్ అథారిటీలో రిజిస్టర్ అయిన ఐఎస్పీ, ఎస్ఎంసీ జాబితాలో ఉన్న సంస్థలు తొమ్మిది నెలల్లో రిజిస్టర్ చేసుకోవాలి. తొమ్మిది నెలల్లో ఇస్లామాబాద్లోని చిరునామాతో పర్మినెంట్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలి.

కోర్టుకు..
దేశంలో సోషల్ మీడియా ప్లాట్ఫాంలో లేనందున ఈ నిబంధనలు తప్పనిసరి అని సీనియర్ అధికారులు చెబుతున్నారు. కాగా, పాక్ తాజా నిబంధనలపై టెక్ దిగ్గజాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ప్రజల వాక్స్వాతంత్రాన్ని హరించేలా ఉన్నాయని తెలిపింది. ఈ నిబంధనలను వ్యతిరేకిస్తున్న సోషల్ మీడియా సంస్థలు అప్పీల్కు వెళ్లే అవకాశముంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications