దేశీయ అతిపెద్ద దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) ఐపీవోకు వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు భారీ రిటర్న్స్ అందించింది. టాటా గ్రూప్కు ప్రధాన ఆదాయ వనరు టీసీఎస్. గత పదిహేడేళ్ల కాలంలో ఈ సంస్థ వాటాదారులకు 3,000 శాతానికి పైగా రిటర్న్స్ అందించింది. ఈ మేరకు టీసీఎస్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. 2004లో కంపెనీ ఐపీఓలో భాగంగా ఒక్కో షేరు పైన రూ.850 పెట్టుబడిగా పెట్టి ఉంటే, ప్రస్తుతం ఆ పెట్టుబడి విలువ రూ.28,000కు చేరుకుంది.
ఈ మేరకు టీసీఎస్ వాటాదారుల 26వ వార్షిక సమావేశం(AGM)లో మాట్లాడుతూ ప్రస్తావించారు. అంతేకాదు, గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో కంపెనీ తన నగదు నిల్వల్లో 95 శాతాన్ని వాటాదారులకు పంచినట్లు చెప్పారు. బైబ్యాక్, డివిడెండ్స్ రూపంలో మొత్తం రూ.33,873 కోట్లు షేర్ హోల్డర్లకు చెల్లించినట్లు తెలిపారు.

భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తమ కంపెనీ నిరంతరం కొత్త సేవలు అందిస్తోందని చంద్రశేఖరన్ అన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభాల్లో 25.9 శాతం పురోగతిని నమోదు చేసింది. ప్రతి షేర్ పైన రూ.38 డివిడెండ్ చెల్లిస్తున్నట్లు చెప్పారు.
More From GoodReturns

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!



Click it and Unblock the Notifications