మీరు ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? ప్రముఖ బ్రాండ్లు ఆపిల్, శాంసంగ్, షియోమీ, ఒప్పో, రియల్మి స్మార్ట్ ఫోన్ల ధరలు త్వరలో పెరగవచ్చు. ఇటీవల ప్రభుత్వ డిస్ప్లేలు, టచ్ ప్యానెల్పై దిగుమతి సుంకాన్ని 10 శాతం విధించింది. తయారీదారులపై పడే భారం కొనుగోలుదారులపై పడే అవకాశం ఉంటుంది. ఆత్మనిర్భర్ భారత్ కింద స్థానిక తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వివిధ ప్రయత్నాలు చేస్తోంది. అదనపు సెస్ కారణంగా దిగుమతులపై సెస్ భారం 11 శాతం ప్రభావం ఉంటుంది.

పండుగ సీజన్పై ప్రభావం
ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద స్ధానిక ఉత్పత్తులను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం ఆయా వస్తువులపై దిగుమతి సుంకాన్ని విధిస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో డిస్ప్లే, టచ్ ప్యానల్స్పై సుంకంతోపాటు అదనపు సెస్ జత కలిస్తే దిగుమతి చేసుకునే వారిపై 11 శాతం భారం పడుతుంది. దిగుమతి సుంకాల కారణంగా సెల్ఫోన్ ధరలు 1.5 శాతం నుండి 5 శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్మార్ట్ఫోన్ల ధరలు పెరిగితే పండగ సీజన్ పైన ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి.

ధరల పెరుగుదల ఎలా అంటే
స్థానిక తయారీని ప్రోత్సహించేందుకు దశలవారీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా సుంకాన్ని ఏప్రిల్ 2019 నుండి విధించాలని నిర్ణయించారు. అయితే స్థానిక తయారీదారులు సమయం ఇచ్చే ఉద్దేశ్యంలో భాగంగా ఈ నిర్ణయాన్ని రెండుసార్లు వాయిదా వేశారు. ప్రస్తుతం దేశంలో హోలిటెక్, టీసీఎల్ వంటి నాలుగు కంపెనీలు డిస్ప్లే ప్యానెల్స్ విభాగంలో ఉన్నాయి. కొన్ని కంపెనీలు ధరలు వెంటనే పెరుగుతాయని చెప్పగా, మరికొన్ని డ్యూటీ ఫీజు గరిష్ట ప్రభావాన్ని బట్టి పెంచుతామని చెబుతున్నాయి.

లోకల్ ఉత్పత్తి
ఆపిల్ అతిపెద్ద ఐఫోన్ అసెంబ్లర్ ఫాక్స్కాన్, పెగార్టన్, పెగాట్రోన్, విస్ట్రోన్తో పాటు శాంసంగ్, కార్బోన్, లావా, డిక్సన్ 100 బిలియన్ డాలర్ల మొబైల్ ఎగుమతుల ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచాయి. ఆపిల్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అలాగే, గ్లోబల్ దిగ్గజం శాంసంగ్, లోకల్ హ్యాండ్సెట్ మేకర్స్ లావా, డిక్సాన్ కంపెనీలు రానున్న అయిదేళ్లలో ప్రభుత్వం కొత్త స్కీం.. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యార్చరింగ్ ఉత్పత్తిలో భాగంగా రూ.11 లక్షల కోట్ల మొబైల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్, కాంపోనెంట్ తయారీకి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications