గురువారం ఐఆర్ సీటీసీ షేర్లలో ఒత్తిడి కనిపిస్తోంది. ఉదయం 10 గంటల 39 నిమిషాలకు ఐఆర్ సీటీసీ షేర్లు 4.95 శాతం నష్టపోయి రూ. 698.55 వద్ద కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గురువారం ఐఆర్సీటీసీలో 5 శాతం వాటాలను విక్రయించనుంది. కేంద్ర ప్రభుత్వం OFS విభాగంలో IRCTC షేర్లను దాని మూల ధర రూ. 680కి విక్రయించబోతోంది. దీంతో ఈ స్టాక్ అమ్మకాల ఒత్తి కొనసాగుతోంది.

2 కోట్ల IRCTC షేర్లు
OFS పథకం కింద 2 కోట్ల IRCTC షేర్లను, అంటే 2.5 శాతం వాటాను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మరో 2.5 శాతం షేర్లు అంటే మొత్తం 4 కోట్ల షేర్లను ఓవర్ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ కింద 2 విడతలుగా విక్రయించనున్నారు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)కి చెందిన దాదాపు 4 కోట్ల షేర్లను ఒక్కో షేరుకు రూ.680 చొప్పున విక్రయించడం వల్ల కేంద్రానికి దాదాపు రూ.2,700 కోట్లు వస్తాయి. కాగా బుధవారం ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్లో IRCTC షేర్లు రూ.734.70 వద్ద ముగిశాయి.

రిటైల్ ఇన్వెస్టర్లు
కేంద్ర ప్రభుత్వంచే ఈ వాటా విక్రయం కోసం OFS గురువారాల్లో సంస్థాగత పెట్టుబడిదారులకు శుక్రవారం రిటైల్ పెట్టుబడిదారులకు తెరవబడుతుంది. ఈ విధంగా, చిన్న పెట్టుబడిదారులు IRCTC షేర్లలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు శుక్రవారం OFS కొనుగోలు చేయవచ్చు.రిటైల్ ఇన్వెస్టర్లు IPOలో పెట్టుబడి పెట్టినట్లే స్టాక్ ట్రేడింగ్ ప్లాట్ఫారమ్లో OFS ద్వారా అమ్మకానికి అందించే అన్ని షేర్లను కొనుగోలు చేయవచ్చు.

4 కోట్ల షేర్లు
IRCTCకి చెందిన 5 శాతం షేర్లు అంటే 4 కోట్ల షేర్ల విక్రయం ద్వారా వచ్చే ఆదాయం కేంద్ర ప్రభుత్వంలోని డిజిన్వెస్ట్మెంట్ విభాగానికి వెళ్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆస్తుల ఉపసంహరణ ద్వారా దాదాపు రూ.65,000 కోట్లు సమీకరించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. త్వ రంగ సంస్థల వాటాల విక్రయం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.28,383 కోట్లు సమీకరించింది.

ఐడీబీఐ బ్యాంక్
మరో పక్క ఐడీబీఐ బ్యాంక్లో 60.72 శాతం వాటాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసీ నిర్ణయించాయి. ఈ షేర్లను కొనుగోలు చేయాలనుకునే వారు బిడ్ మొత్తానికి దరఖాస్తు చేసుకోవచ్చని అక్టోబర్లో కేంద్రం ప్రకటన చేసింది. నెల రోజుల క్రితం యాక్సిస్ బ్యాంక్ లో కేంద్రానికి ఉన్న 1.55 శాతం వాటాను విక్రయించారు. మొత్తం 4,65,34,903 షేర్లను అమ్మారు.

యాక్సిస్ బ్యాంకు
యాక్సిస్ బ్యాంకులో వాటా అమ్మకం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సుమారు రూ. 4,000 కోట్లు లభించాయి. గతేడాది మే నెలలోనూ ప్రభుత్వం ఎస్యూయూటీఐ ద్వారా యాక్సిస్ బ్యాంకులో 1.95 శాతం వాటాను విక్రయించింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications