For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డిసెంబర్ త్రైమాసిక ఫలితాల తరువాత నెస్లే ఇండియా షేర్లు పతనం.. రీజన్ ఇదే

|

డిసెంబర్ త్రైమాసిక ఫలితాల తర్వాత ఎఫ్‌ఎంసిజి ప్రధాన నెస్లే ఇండియా షేర్లు 5 శాతం పడిపోయి ఇంట్రాడే కనిష్టానికి 16,360 రూపాయలకు చేరుకున్నాయి. 2020 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నెస్లే ఇండియా లాభం గత ఏడాది ఇదే త్రైమాసికంలో 472.6 కోట్ల రూపాయలు ఉంది . దీంతో పోలిస్తే 2 శాతం పెరిగి 483.3 కోట్ల రూపాయలకు చేరుకుంది. బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ విశ్లేషణ ప్రకారం కంపెనీ నికర లాభం 550 కోట్లు నివేదిస్తుందని నెస్లే ఇండియా ప్రకటించినా, లాభాలు ఆశించిన మేరకు రాలేదని తెలుస్తుంది.

తీవ్ర నష్టాలలో జిఎంఆర్ ఇన్‌ఫ్రా.. ఈ త్రైమాసికంలో రూ.1,120 కోట్లు నష్టం, పతనమైన షేర్ ధరతీవ్ర నష్టాలలో జిఎంఆర్ ఇన్‌ఫ్రా.. ఈ త్రైమాసికంలో రూ.1,120 కోట్లు నష్టం, పతనమైన షేర్ ధర

 కోవిడ్ -19 ప్రభావంతో ఆశించిన మేరకు రాని లాభాలు నెస్లే ఇండియా ప్రకటన

కోవిడ్ -19 ప్రభావంతో ఆశించిన మేరకు రాని లాభాలు నెస్లే ఇండియా ప్రకటన

ఉత్పత్తుల అమ్మకం ద్వారా నెస్లే ఇండియా ఆదాయం 9 శాతం పెరిగి 3,417.52 కోట్ల రూపాయలకు చేరుకుంది. నెస్లే ఇండియా దేశీయ అమ్మకాల వృద్ధి వాల్యూమ్ ద్వారా నడిచింది .అంతేకాదు త్రైమాసికంలో అవుట్ ఆఫ్ హోమ్ ఛానెల్‌లో దాని డిమాండ్ మరింత మెరుగుపడింది. అయితే కోవిడ్ -19 కారణంగా ఇది ప్రభావితమైందని నెస్లే ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. కాఫీ ఎగుమతులు తక్కువగా ఉన్నందున దాని ఎగుమతి అమ్మకాలు 7.7 శాతం క్షీణించాయి.

కరోనా సమయంలో నిబద్దతతో పని చేసిన వారికి కృతజ్ఞత తెలిపిన నేస్లే చైర్మన్

కరోనా సమయంలో నిబద్దతతో పని చేసిన వారికి కృతజ్ఞత తెలిపిన నేస్లే చైర్మన్

గడిచిన సంవత్సరం కరోనా సమయంలో సంస్థ ప్రయోజనాలను కొనసాగించడానికి అచంచలమైన నిబద్ధతను ప్రదర్శించిందని, ఉద్యోగులు, భాగస్వాములు, సరఫరాదారులు, వాస్తవానికి మొత్తం వ్యవస్థ కరోనా కారణంగా అసాధారణమైన సవాలును స్వీకరించి గట్టిగా ప్రయత్నాలు చేస్తోందని సంస్థ పేర్కొంది. కరోనా అసాధారణ కాలంలో సంస్థ ఉద్యోగులు, భాగస్వాములు, సరఫరాదారులు చేసిన కృషికి, త్యాగాలకు తాము ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటామని , మా ఫలితాలు వారి సంకల్పానికి నిదర్శనం అని నెస్లే ఇండియా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ నారాయణన్ ఒక ప్రకటనలో తెలిపారు.

 నెస్లే ఇండియా బోర్డు ఈక్విటీ షేరుకు రూ. 65 తుది డివిడెండ్‌ ప్రకటన

నెస్లే ఇండియా బోర్డు ఈక్విటీ షేరుకు రూ. 65 తుది డివిడెండ్‌ ప్రకటన

కఠినమైన పరిస్థితులలో కూడా బలమైన దేశీయ అమ్మకాల వృద్ధిని అందించినందుకు తాను సంతోషిస్తున్నానని నెస్లే ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ నారాయణ తెలిపారు . తమ కీలక బ్రాండ్లలో మూడింట రెండు వంతుల మ్యాగీ నూడుల్స్, కిట్కాట్ మరియు నెస్కాఫ్ క్లాసిక్ గత సంవత్సరం రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. దీనికి మార్కెటింగ్ పురోగతి ఉంది. ముఖ్యంగా చివరి త్రైమాసికంలో గణనీయంగానే వృద్ధి కనిపించిందని ఆయన పేర్కొన్నారు. నెస్లే ఇండియా బోర్డు ఈక్విటీ షేరుకు. 65.00 తుది డివిడెండ్‌ను 20 సంవత్సరానికి గాను అందించనుంది. అందుకోసం 62.67 కోట్లకు సిఫారసు చేసింది

English summary

డిసెంబర్ త్రైమాసిక ఫలితాల తరువాత నెస్లే ఇండియా షేర్లు పతనం.. రీజన్ ఇదే | Shares of Nestle India fall after the December quarter earnings .. This is the reason

Shares of FMCG major Nestle India fell as much as 5 per cent to hit an intraday low of ₹ 16,360 a day after it reported December quarter earnings. Nestle India's profit in quarter ended December 2020 rose 2 per cent to ₹ 483.3 crore from ₹ 472.6 crore during the same quarter last year. The profit numbers declared by Nestle India were below expectations as analysts at brokerage firm Motilal Oswal expected the company to report net profit of ₹ 550 crore.
Story first published: Wednesday, February 17, 2021, 18:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X