స్టాక్ మార్కెట్ శుక్రవారం స్వల్ప నష్టాల్లో లేదా ఫ్లాట్గా ముగిశాయి. ఆటో, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ రంగ స్టాక్స్ ఒత్తిడిలో కనిపించాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు లాభాల్లో ముగిసాయి. సెన్సెక్స్ స్వల్పంగా నష్టపోయినప్పటికీ 57,200 పాయింట్లకు పైన, నిఫ్టీ 17,100 పాయింట్ల పైన ముగిసింది. ఉదయం సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్ల లాభాల్లో ప్రారంభం అయింది. మధ్యాహ్నం గం.1.30 వరకు మంచి లాభాల్లో కనిపించినప్పటికీ, ఆ తర్వాత క్రమంగా క్షీణించింది. మార్కెట్ క్లోజ్ అయ్యే అరగంటకు ముందు అంటే మధ్యాహ్నం గం.3 సమయానికి నష్టాల్లోకి వెళ్లింది. ఆ తర్వాత దాదాపు అదే స్థాయిలో ముగిసింది. ఆరంభ లాభాలు కోల్పోయాయి.
సెన్సెక్స్ 57,795.11 పాయింట్ల వద్ద ప్రారంభమై, 58,084.33 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,119.28 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,208.30 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,373.50 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,077.10 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 76 పాయింట్లు క్షీణించి 57,200 పాయింట్ల వద్ద, నిఫ్టీ 8 పాయింట్లు తగ్గి 17,102 పాయింట్ల వద్ద ముగిసింది.

బీఎస్ఈ 30 స్టాక్స్లో 15 స్టాక్స్ నష్టపోగా, మిగతా 15 లాభపడ్డాయి. ఎన్టీపీసీ 4 శాతానికి పైగా లాభపడింది. మారుతీ, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్ప్ మాత్రం రెండు శాతం నుండి మూడు శాతం వరకు నష్టపోయింది. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఎన్టీపీసీ, యూపీఎల్, సన్ ఫార్మా, ఓఎన్జీసీ, ఇండస్ఇండ్ బ్యాంకు ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో మారుతీ సుజుకీ, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, ఐసీఐసీఐ బ్యాంకు, హీరో మోటో కార్ప్ ఉన్నాయి.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications