ముంబై: స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాల్లో ముగిశాయి. ప్రారంభం నుండి బుల్ రంకె కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్ల నుండి సానుకూల సంకేతాలు, కీలక రంగాల షేర్లు రాణించడం, కరోనా సెకండ్ వేవ్ భయాలు కాస్త తగ్గడం వంటి వివిధ కారణాలతో సూచీలు జంప్ చేశాయి. నేడు సెన్సెక్స్, నిఫ్టీ రెండు శాతానికి పైగా లాభపడ్డాయి. సెన్సెక్స్ మూడు రోజుల 50వేల మార్కును క్రాస్ చేసి క్లోజ్ అయింది. నిఫ్టీ 14800 ఎగువన ముగిసింది. ఐటీ, మెటల్ స్టాక్స్ ఎగిసిపడ్డాయి.

మార్కెట్ లాభాలకు కారణాలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్, ఐరోపా దేశాల లాక్ డౌన్ ఆందోళనల నేపథ్యంలో ఈ వారం మార్కెట్లు నష్టపోతాయని భావించినప్పటికీ, ఎగిసిపడ్డాయి. దేశీయ సంస్ధాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరిగాయి. నాలుగో త్రైమాసిక ఫలితాలపై ఇన్వెస్టర్లు సానుకూల దృక్పథంతో కనిపించారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉన్నప్పటికీ ప్రభావం అంతగా ఉండదనే సంకేతాలు కనిపించాయి. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్న సంకేతాలు మరింత బలంగా ఉన్నాయి. ఇవన్నీ ఇన్వెస్టర్ల సెంటుమెంటును బలపరిచాయి. వీటికి తోడు అంతర్జాతీయ, ఆసియా మార్కెట్లు సానుకూలంగా ఉన్నాయి.

సెన్సెక్స్ 1128 పాయింట్ల జంప్
ఉదయం 49,331.68 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, 50,268.45 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,331.68 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. అంటే ప్రారంభంలోని 49,331.68 పాయింట్లే నేటి కనిష్టం. అంటే ఆ తర్వాత ఏ సమయంలోను సెన్సెక్స్ తగ్గలేదు. చివరకు 1,128.08 (2.30%) పాయింట్లు ఎగిసి 50,136.58 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 14,628.50 పాయింట్లు లాభపడి, 14,876.30 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,617.60 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ +337.80 (2.33%) పాయింట్లు ఎగిసి 14,845.10 పాయింట్ల వద్ద ముగిసింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో UPL 7.27 శాతం, JSW స్టీల్ 5.00 శాతం, టాటా స్టీల్ 4.32 శాతం, HDFC బ్యాంకు 4.18 శాతం, HCL టెక్ 3.89 శాతం లాభపడ్డాయి.
నేటి టాప్ లూజర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా 0.54 శాతం, యాక్సిస్ బ్యాంకు 0.41 శాతం, హిండాల్కో 0.26 శాతం, SBI లైఫ్ ఇన్సురా 0.21 శాతం, భారతీ ఎయిర్ టెల్ 0.19 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, రిలయన్స్, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications