53,000 సమీపంలో నిలిచిన సెన్సెక్స్, నిఫ్టీ 15,850 పైన క్లోజ్
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమై భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 53,000 పాయింట్లకు దాదాపు వంద పాయింట్ల దూరంలో నిలిచింది. ఓ సమయంలో ఈ మార్కును తాకే విధంగా దూసుకెళ్లినప్పటికీ, 20 పాయింట్ల సమీపంలో కిందకు దిగి వచ్చింది. ఐటీ, టెక్నాలజీ, మెటల్ పారిశ్రామిక రంగాల నుండి మద్దతు లభించింది. దీంతో సూచీలు క్రమంగా పైకి ఎగిశాయి.
సెన్సెక్స్ 52,801.44 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,978.58 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,611.97 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,808.70 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,877.35 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,764.20 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 134.32 (0.25%) పాయింట్లు లాభపడి 52,904.05 వద్ద, నిఫ్టీ 41.60 (0.26%) పాయింట్లు లాభపడి 15,853.95 పాయింట్ల వద్ద ముగిసింది.
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో విప్రో, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, లార్సన్ ఉన్నాయి. నేటి టాప్ లూజర్స్ జాబితాలో యూపీఎల్, మారుతీ సుజుకీ, అదానీ పోర్ట్స్, HUL, నెస్ట్లే ఉన్నాయి.