కరోనా నుండి భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఆర్థిక సంస్థలపై సెకండ్ వేవ్ ప్రభావం అంతకుముందు అంచనాల కంటే తక్కువే ఉందన్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ప్రజల ఆరోగ్యం, ప్రాణాలపై ఎక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఆర్థిక వ్యవస్థ మే చివరి నుండి కోలుకుంటోందన్నారు. ఆర్థిక సంస్థల నుండి డేటా లీకేజీ, సైబర్ అటాక్స్, అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు పెరగడం ఆందోళన కలిగించే అంశాలు అన్నారు.

ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయి
కరోనా సెకండ్ వేవ్ కూడా భారత్ పైన తీవ్ర ప్రభావమే చూపిందని, ఏప్రిల్ నెలలో ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం తీవ్రంగానే పడిందని, కానీ మే చివరి నుండి, జూన్ ప్రారంభం నుండి కోలుకోవడం ప్రారంభించిందని చెప్పారు. గత ఏడాది ఏప్రిల్ నుండి ఈ ఏడాది మే నెల వరకు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడిందన్నారు. రోజు రోజుకు కొత్త కేసులు తక్కువగా నమోదు అవుతున్నాయని, దీంతో మే చివరి నుండి ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయన్నారు. గురువారం విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదిక (FSR) లో శక్తికాంత దాస్ పేర్కొన్నారు.

మొండి బకాయిలు..
బ్యాంకులకు చెందిన స్థూల నిరర్థక ఆస్తులు-జీఎన్పీఏ 2021 మార్చి చివరి నాటికి 7.5 శాతంగా ఉన్నాయని, రుణ ఆస్తుల ప్రస్తుత నాణ్యత ప్రకారం చూస్తే 2022 మార్చి చివరి నాటికి ఈ జీఎన్పీఏలు 9.8 శాతానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. పరిస్థితి మరీ ఇబ్బందికరంగా మారితే జీఎన్పీఏలు 11.22 శాతానికి చేరుకోవచ్చునని, వచ్చే సెప్టెంబర్ నాటికి జీఎన్పీఏలు 13.5 శాతానికి చేరొచ్చని జనవరి FSRలో అంచనా వేశారు.

మూలధనం ఉంది
భవిష్యత్తులో ఆటుపోట్లను తట్టుకునేలా బ్యాంకుల వద్ద మూలధనం ఉందన్నారు ఆర్బీఐ గవర్నర్. రిటైల్తో పాటు MSMEలకు ఇచ్చిన రుణాలను గమనిస్తుండాలని బ్యాంకులకు సూచించారు. కరోనా వల్ల ఈ విభాగాలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయన్నారు. మొండి బకాయిల్లో భారీ మొత్తాలు 77.9 శాతంగా ఉన్నట్లు తెలిపారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications