కరోనా నుండి భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఆర్థిక సంస్థలపై సెకండ్ వేవ్ ప్రభావం అంతకుముందు అంచనాల కంటే తక్కువే ఉందన్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ప్రజల ఆరోగ్యం, ప్రాణాలపై ఎక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఆర్థిక వ్యవస్థ మే చివరి నుండి కోలుకుంటోందన్నారు. ఆర్థిక సంస్థల నుండి డేటా లీకేజీ, సైబర్ అటాక్స్, అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు పెరగడం ఆందోళన కలిగించే అంశాలు అన్నారు.

ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయి
కరోనా సెకండ్ వేవ్ కూడా భారత్ పైన తీవ్ర ప్రభావమే చూపిందని, ఏప్రిల్ నెలలో ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం తీవ్రంగానే పడిందని, కానీ మే చివరి నుండి, జూన్ ప్రారంభం నుండి కోలుకోవడం ప్రారంభించిందని చెప్పారు. గత ఏడాది ఏప్రిల్ నుండి ఈ ఏడాది మే నెల వరకు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడిందన్నారు. రోజు రోజుకు కొత్త కేసులు తక్కువగా నమోదు అవుతున్నాయని, దీంతో మే చివరి నుండి ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయన్నారు. గురువారం విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదిక (FSR) లో శక్తికాంత దాస్ పేర్కొన్నారు.

మొండి బకాయిలు..
బ్యాంకులకు చెందిన స్థూల నిరర్థక ఆస్తులు-జీఎన్పీఏ 2021 మార్చి చివరి నాటికి 7.5 శాతంగా ఉన్నాయని, రుణ ఆస్తుల ప్రస్తుత నాణ్యత ప్రకారం చూస్తే 2022 మార్చి చివరి నాటికి ఈ జీఎన్పీఏలు 9.8 శాతానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. పరిస్థితి మరీ ఇబ్బందికరంగా మారితే జీఎన్పీఏలు 11.22 శాతానికి చేరుకోవచ్చునని, వచ్చే సెప్టెంబర్ నాటికి జీఎన్పీఏలు 13.5 శాతానికి చేరొచ్చని జనవరి FSRలో అంచనా వేశారు.

మూలధనం ఉంది
భవిష్యత్తులో ఆటుపోట్లను తట్టుకునేలా బ్యాంకుల వద్ద మూలధనం ఉందన్నారు ఆర్బీఐ గవర్నర్. రిటైల్తో పాటు MSMEలకు ఇచ్చిన రుణాలను గమనిస్తుండాలని బ్యాంకులకు సూచించారు. కరోనా వల్ల ఈ విభాగాలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయన్నారు. మొండి బకాయిల్లో భారీ మొత్తాలు 77.9 శాతంగా ఉన్నట్లు తెలిపారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications