కరోనా సెకండ్ వేవ్ 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత ఆర్థిక కార్యకలాపాలకు ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 2021 నెలవారీ సమీక్షా నివేదికలో పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా అంటువ్యాధి ఉధృతమవుతోంది. మరణాలు కూడా పెరుగుతున్నాయి. అయినప్పటికీ కరోనా ఫస్ట్ వేవ్తో పోలిస్తే సెకండ్ వేవ్ ప్రభావం కాస్త తక్కువగా ఉంటుందని అభిప్రాయపడింది. గత ఆర్థిక సంవత్సరం రెండు త్రైమాసికాలు ప్రతికూలత నమోదు చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది దేశవ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో జూన్ త్రైమాసికంలో మైనస్ 23.9 శాతం ప్రతికూలత, తర్వాత త్రైమాసికంలో మైనస్ 7.5 శాతం ప్రతికూలత నమోదు చేసింది. ఆ తర్వాత జీడీపీ వృద్ధి రేటు మూడో త్రైమాసికంలో 0.4 శాతంగా నమోదయింది.
అయితే తాజాగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత ఆర్థిక రికవరీపై కాస్త ప్రభావం చూపుతోంది. కరోనాతో కలిసి జీవించడం, అంతర్జాతీయ అనుభవం, ఆర్థిక రికవరీపై సెకండ్ వేవ్ ప్రభావం కాస్త తక్కువగా ఉంటుందని ఆర్థికమంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. ఆరోగ్య మౌలిక సదుపాయాలు పెంచడం, సరఫరా వేగవంతం చేయడం కలిసి వస్తుందని తెలిపింది.

ఇటీవల వాల్ స్ట్రీట్ బ్రోకరేజీ గోల్డ్మన్ శాక్స్ FY22లో భారత ఆర్థిక వృద్ధి రేటును 11.1 శాతానికి తగ్గించింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో భారత రికవరీపై ప్రభావం పడుతుందని అంతర్జాతీయ రేటింగ్ ఎజెన్సీలు అంచనా వేస్తున్నాయి. కరోనా సమయంలోను దేశంలో వ్యవసాయ రంగం మాత్రమే చాలా ఆశాజనకంగా కనిపిస్తోంది. రాబోయే పంట కాలంలో రికార్డ్ స్థాయిలో పంట ఉత్పత్తి ఉంటుందని భావిస్తున్నారు.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..



Click it and Unblock the Notifications