బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలాకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. తన కుటుంబానికి చెందిన ఐటీ ఎడ్యుటెక్ అండ్ ట్రెయినింగ్ సంస్థ ఆప్టెక్ షేర్లకు సంబంధించి ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతో సెబీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆప్టెక్ అతనికి, అతని కుటుంబం నియంత్రణలో ఉన్న సంస్థ.

విచారిస్తున్న సెబి
దీనికి సంబంధించి సెబి రాకేష్ ఝున్ఝున్వాలా, అతని కుటుంబం, ఆప్టెక్ ఇతర బోర్డు మెంబర్స్, ఇన్వెస్టర్ రమేష్ ఎస్ ధమానీ, డైరెక్టర్ మధు జయకుమార్ తదితరుల పాత్రపై సెబి విచారిస్తోంది. ఈ అంశానికి సంబంధించిన బ్యాంకు అకౌంట్స్ను ప్రీజ్ చేయాలని యోచిస్తున్నట్లు కూడా సెబీ... ఝున్ఝున్వాలాకు పంపిన నోటీసులో పేర్కొందని తెలుస్తోంది.

గతంలోనే విచారణకు హాజరైన ఝున్ఝున్వాలా, ఫ్యామిలీ
స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ (సెబీ) ఈ ఏడాది జనవరి నెలలో ఝున్ఝున్వాలా సోదరుడు రాకేష్ కుమార్ను, భార్య రేఖ, అత్త సుశీలాదేవిని విచారణ నిమిత్తం పిలిచింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో గల సెబీ హెడ్ క్వార్టర్లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎదుట రాకేష్ ఝున్ఝున్ వాలా కూడా విచారణకు హాజరయ్యారు. అతనిని అధికారులు కొన్ని గంటల పాటు విచారించారు.

నాలుగేళ్ల క్రితం...
స్టాక్ ఎక్స్చేంజీలో నిబంధనల ప్రకారం ఇన్సైడర్ ట్రేడింగ్ చట్టవిరుద్ధం. సొంత ప్రయోజనాల కోసం ఇన్సైడర్ ట్రేడింగ్ చేసేవారు ఉంటారు. మార్కెట్ రెగ్యులేటర్ ప్రత్యేకంగా నాలుగేళ్ల క్రితం అంటే 2016 ఫిబ్రవరి నుండి 2016 సెప్టెంబర్ మధ్య అంశానికి సంబంధించి విచారిస్తోంది. ఆ సమయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. మీడియాలో వస్తున్న వార్తల మేరకు సోదరుడు, భార్య 7,63,057 షేర్లను బ్లాక్ డీల్స్ ద్వారా కొనుగోలు చేసిన తర్వాత సెప్టెంబర్ 7, 2017న అప్పర్ సర్క్యూట్ రూ.175.05 వద్ద లాక్ చేశారు.

పెరిగిన వాటా
ఆప్టెక్లో రాకేష్ ఝున్ఝున్వాలాకు 24.24 శాతం వాటా ఉంది. ఈ వ్యాల్యూ రూ.160 కోట్లు. 2005లో అతను కంపెనీని కొనుగోలు చేసినప్పుడు అతని వాటా 10 శాతంగా ఉంది. ఆ తర్వాత ఈ వాటా క్రమంగా పెరిగింది. రాకేష్ ఝున్ఝున్ వాలా తన సొంత ఈక్విటీ పోర్ట్పోలియో రేర్ ఎంటర్ప్రైజెస్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తాడు. కాగా, తాజా అంశానికి సంబంధించి రేర్ ఎంటర్ప్రైజెస్ సీఈవో, ఆప్టెక్ డైరెక్టర్ సోదరికి కూడా సెబి నోటీసులు పంపించిందని తెలుస్తోంది.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..



Click it and Unblock the Notifications