బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలాకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. తన కుటుంబానికి చెందిన ఐటీ ఎడ్యుటెక్ అండ్ ట్రెయినింగ్ సంస్థ ఆప్టెక్ షేర్లకు సంబంధించి ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతో సెబీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆప్టెక్ అతనికి, అతని కుటుంబం నియంత్రణలో ఉన్న సంస్థ.

విచారిస్తున్న సెబి
దీనికి సంబంధించి సెబి రాకేష్ ఝున్ఝున్వాలా, అతని కుటుంబం, ఆప్టెక్ ఇతర బోర్డు మెంబర్స్, ఇన్వెస్టర్ రమేష్ ఎస్ ధమానీ, డైరెక్టర్ మధు జయకుమార్ తదితరుల పాత్రపై సెబి విచారిస్తోంది. ఈ అంశానికి సంబంధించిన బ్యాంకు అకౌంట్స్ను ప్రీజ్ చేయాలని యోచిస్తున్నట్లు కూడా సెబీ... ఝున్ఝున్వాలాకు పంపిన నోటీసులో పేర్కొందని తెలుస్తోంది.

గతంలోనే విచారణకు హాజరైన ఝున్ఝున్వాలా, ఫ్యామిలీ
స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ (సెబీ) ఈ ఏడాది జనవరి నెలలో ఝున్ఝున్వాలా సోదరుడు రాకేష్ కుమార్ను, భార్య రేఖ, అత్త సుశీలాదేవిని విచారణ నిమిత్తం పిలిచింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో గల సెబీ హెడ్ క్వార్టర్లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎదుట రాకేష్ ఝున్ఝున్ వాలా కూడా విచారణకు హాజరయ్యారు. అతనిని అధికారులు కొన్ని గంటల పాటు విచారించారు.

నాలుగేళ్ల క్రితం...
స్టాక్ ఎక్స్చేంజీలో నిబంధనల ప్రకారం ఇన్సైడర్ ట్రేడింగ్ చట్టవిరుద్ధం. సొంత ప్రయోజనాల కోసం ఇన్సైడర్ ట్రేడింగ్ చేసేవారు ఉంటారు. మార్కెట్ రెగ్యులేటర్ ప్రత్యేకంగా నాలుగేళ్ల క్రితం అంటే 2016 ఫిబ్రవరి నుండి 2016 సెప్టెంబర్ మధ్య అంశానికి సంబంధించి విచారిస్తోంది. ఆ సమయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. మీడియాలో వస్తున్న వార్తల మేరకు సోదరుడు, భార్య 7,63,057 షేర్లను బ్లాక్ డీల్స్ ద్వారా కొనుగోలు చేసిన తర్వాత సెప్టెంబర్ 7, 2017న అప్పర్ సర్క్యూట్ రూ.175.05 వద్ద లాక్ చేశారు.

పెరిగిన వాటా
ఆప్టెక్లో రాకేష్ ఝున్ఝున్వాలాకు 24.24 శాతం వాటా ఉంది. ఈ వ్యాల్యూ రూ.160 కోట్లు. 2005లో అతను కంపెనీని కొనుగోలు చేసినప్పుడు అతని వాటా 10 శాతంగా ఉంది. ఆ తర్వాత ఈ వాటా క్రమంగా పెరిగింది. రాకేష్ ఝున్ఝున్ వాలా తన సొంత ఈక్విటీ పోర్ట్పోలియో రేర్ ఎంటర్ప్రైజెస్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తాడు. కాగా, తాజా అంశానికి సంబంధించి రేర్ ఎంటర్ప్రైజెస్ సీఈవో, ఆప్టెక్ డైరెక్టర్ సోదరికి కూడా సెబి నోటీసులు పంపించిందని తెలుస్తోంది.
More From GoodReturns

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications