Sebi New Rules: స్టాక్ మార్కెట్ నిబంధనల్లో కొన్ని మార్పులు చేస్తున్నట్లు సెబీ ప్రకటించింది. ఆఫర్ ఫర్ సేల్లో రిటైల్ మదుపర్లకూ మార్గం సుగమం చేసింది. సాంకేతిక సమస్యల కారణంగా ఎక్స్ఛేంజ్ల సేవల్లో జాప్యం నివారణకు చర్యలు తీసుకుంది.

నాన్ ప్రమోటర్లకూ ఓఎఫ్ఎస్ అవకాశం:
'ఆఫర్ ఫర్ సేల్' (ఓఎఫ్ఎస్) ద్వారా షేర్ల విక్రయానికి సంబంధించి సెబీ కొత్త నిబంధనలు జారీ చేసింది. ప్రమోటర్లు కాని వాటాదారులు సైతం తమ షేర్లు విక్రయించడానికి బాటలు వేసింది. రూ. 1000 కోట్ల కంటే ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీలకు ఓఎఫ్ఎస్లో పాల్గొనే అవకాశం కల్పించింది. తద్వారా ప్రమోటర్లు మాత్రమే ఇప్పటివరకు ఈ పద్ధతిని వినియోగించుకుంటుండగా.. మరింత మంది దీని ద్వారా ప్రయోజనం పొందే వెసులుబాటు ఏర్పడింది. ఫిబ్రవరి 10 నుంచి ఈ నిబంధన అమలు కానున్నట్లు వెల్లడించింది.

సాంకేతిక సమస్యలకు చెక్..
ట్రేడింగ్ సమయంలో సాధారణంగా ఎదుర్కొనే సాంకేతిక సమస్యలకు చెక్ పెట్టే విధంగా నిబంధనల్లో సెబీ కొన్ని మార్పులు చేసింది. సమస్య తలెత్తిన 15 నిమిషాల్లో ట్రేడర్స్ మరియు బ్రోకర్స్ కు ఎక్స్ఛేంజ్లు సమాచారం అందించాలని ఆదేశించింది. అంతేగాక ప్రతి 45 నిమిషాలకు సమస్య నివారణకు తీసుకుంటున్న చర్యలతో అప్డేట్స్ ఇస్తూ ఉండాలని నిర్ణయించింది. ఎక్కువ సమయం ఇబ్బంది కొనసాగితే, అనివార్య పరిస్థితుల్లో ట్రేడింగ్ సమయాన్ని సైతం పొడిగించాలని తెలిపింది.

ఏమిటీ ఓఎఫ్ఎస్:
సాధారణంగా ప్రమోటర్లు నిధులను సేకరించడానికి 'ఆఫర్ ఫర్ సేల్' మార్గాన్ని ఎంచుకుంటారు. దీని ద్వారా తమ వాటాలో కొంత భాగాన్ని ఇతర కంపెనీలు, దేశీయ మరియు విదేశీ సంస్థలకు విక్రయిస్తారు. ఆఫర్ చేస్తున్న మొత్తం షేర్లలో కనీసం 25% మ్యూచువల్ ఫండ్స్ మరియు ఇన్సూరెన్స్ కంపెనీలకు, 10 శాతాన్ని రిటైల్ పెట్టుబడిదారులకు రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓఎఫ్ఎస్ ద్వారా షేర్లు విక్రయించేందుకు నాన్ ప్రమోటర్లు కనీసం 10% వాటా కలిగి ఉండాలని సెబీ గతంలో ప్రకటించింది. దానికి కొనసాగింపుగా 4 నెలల వ్యవధిలోనే తాజా నిర్ణయం వెలువడినట్లు తెలుస్తోంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications