కిషోర్ బియానికి సెబి షాక్, రిలయన్స్తో డీల్పై ఎలాంటి ప్రభావం చూపదని ఫ్యూచర్ గ్రూప్
ముంబై: ఫ్యూచర్ గ్రూప్-రిలయన్స్ ఒప్పందంపై అమెజాన్ కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. అంతేకా, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) ఫ్యూచర్ గ్రూప్ అధినేత కిషోర్ బియానీపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ గ్రూప్ స్పందించింది. రిలయన్స్తో జరిగిన రూ.24,713 కోట్ల తమ ఒప్పందంపై ప్రభావం చూపవని తెలిపింది. అంతేకాదు, ఫ్యూచర్ కార్పోరేట్ రిసోర్సెస్ ప్రయివేట్ లిమిటెడ్(FCRPL) కూడా సెబి చర్యలపై అప్పీల్ చేయాలని భావిస్తోంది.
ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ CMD కిషోర్ బియానీతో పాటు ఆ సంస్థకు చెందిన కొందరు ప్రమోటర్లపై సెబీ వేటు వేసింది. కంపెనీ షేర్లలో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలతో కిషోర్ బియానీతోపాటు ఫ్యూచర్ కార్పొరేట్ రిసోర్సెస్ ప్రయివేట్ లిమిటెడ్ (FCRPL), అనిల్ బియానీ, FCRPL ఎంప్లాయీస్ ట్రస్ట్ను ఏడాదిపాటు సెక్యూరిటీస్ మార్కెట్ నుండి నిషేధించింది.
ఇల్లు కొనుగోలుకు ఇదే సమయం, ట్యాక్స్ బెనిఫిట్స్ ఎన్నో
అంతేకాదు, కిషోర్ బియానీ, అనిల్ బియానీ, FCRPLకు రూ.కోటి చొప్పున జరిమానా విధించింది. ఇన్సైడర్ ట్రేడింగ్తో అక్రమంగా ఆర్జించిన రూ.20.53 కోట్ల లాభాలను రిటర్న్ చేయాలని అందరికీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ గ్రూప్ స్పందించింది. దీనిపై అప్పీల్కు వెళ్లాలని యోచిస్తోంది.
రిలయన్స్ గ్రూప్తో కుదుర్చుకున్న రూ.24,713 కోట్ల ఒప్పందం మీద యథాస్థితిని కొనసాగించాలన్న ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వును ఫ్యూచర్ రిటైల్ సంస్థ సవాల్ చేసింది. ఇందుకు సంబంధించి అప్పీలును ఢిల్లీ హైకోర్టు జాయింట్ రిజిస్ట్రార్ ముందు ఉంచింది. దీనిపై విచారణ జరుగుతోంది. సెబి చర్యలు రిలయన్స్తో డీల్కు అడ్డంకులు కలిగించదని ఫ్యూచర్ గ్రూప్ తెలిపింది.