బెంగళూరు-హైదరాబాద్ మధ్య రైలు ప్రయాణం సమయం భారీగా తగ్గిపోనుంది. అతి త్వరలోనే మరింత వేగవంతంగా, సౌకర్యవంతంగా ప్రయాణం మారనుంది. వచ్చే నెల నుంచి అమలులోకి రానున్న ఈ మార్పులు..దక్షిణ భారత రైల్వే నెట్వర్క్లో జరుగుతున్న కీలక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యక్ష ఫలితంగా నిలవనున్నాయి. ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్న South Western Railway (SWR), బెంగళూరు-హైదరాబాద్ కారిడార్ను అధిక వేగంతో పాటుగా అధిక సామర్థ్యంతో నడిచే మార్గంగా అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించింది.
దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని మాకాజిపల్లి, ధర్మవరం మధ్య 30 కిలోమీటర్ల మేర ట్రాక్ డబ్లింగ్ పనులు పూర్తికావడంతో ఈ మార్గంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ సెక్షన్కు రైల్వే భద్రతా కమిషనర్ గరిష్టంగా 110 కి.మీ. వేగంతో రైళ్లను నడపడానికి అనుమతి ఇవ్వడం విశేషం. డబ్లింగ్తో పాటు ట్రాక్ నాణ్యతను మెరుగుపరచడంతో.. రైళ్లు ఇప్పటి వరకు కంటే వేగంగా, సాఫీగా ప్రయాణించేందుకు మార్గం సుగమమైంది. ట్రయల్ రన్ సమయంలో ఈ ట్రాక్పై రైలు 121 కి.మీ. వేగంతో నడిచినప్పటికీ.. ఎలాంటి డోలన సమస్యలు కనిపించలేదని అధికారులు తెలిపారు. ఇది భద్రతా ప్రమాణాలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో స్పష్టంగా చూపిస్తోంది.

ఈ అభివృద్ధితో పెనుకొండ నుంచి ధర్మవరం వరకు మొత్తం డబ్లింగ్ ప్రాజెక్టు ఇప్పుడు 110 కి.మీ. గరిష్ట వేగానికి అనుకూలంగా పూర్తయింది. ఈ ప్రాజెక్టు కేవలం ట్రాక్ డబ్లింగ్కే పరిమితం కాకుండా, విస్తృత మౌలిక సదుపాయాల అభివృద్ధిని కూడా కలిగి ఉంది. మొత్తం మార్గంలో 66 చిన్న వంతెనలు.. 15 రోడ్డు అండర్ బ్రిడ్జులు, ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యాయి. అదనంగా, ఐదు లైన్లతో కూడిన ఒక స్టేషన్ యార్డ్ను అభివృద్ధి చేయడం ద్వారా రైళ్ల రాకపోకలను మరింత సులభతరం చేశారు.
ఇంకో కీలకమైన విషయం ఏమిటంటే.. ఉత్తర Bengaluru లోని యలహంక నుంచి ధర్మవరం వరకు గరిష్ట వేగాన్ని 130 కి.మీ.కు పెంచే పనులు కూడా తుది దశలో ఉన్నాయి. ఇవి మార్చి నాటికి పూర్తవుతాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ వేగం పెంపుతో బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశముంది. ముఖ్యంగా దీర్ఘదూర ప్రయాణికులు, ఉద్యోగ అవసరాల కోసం తరచూ ప్రయాణించే వారు ఈ మార్పులను నేరుగా ఆస్వాదించనున్నారు.
ఈ అప్గ్రేడ్ల వల్ల సుమారు 161 కిలోమీటర్ల పొడవైన కీలక కారిడార్ లాభపడనుంది. ఇందులో ముఖ్యంగా Yeshwantpur-Kacheguda Vande Bharat Express వంటి అధిక ఆక్యుపెన్సీ, సెమీ హైస్పీడ్ రైళ్లు ఉన్నాయి. వేగం పెరగడం వల్ల ఆలస్యాలు తగ్గి, టైమ్టేబుల్ విశ్వసనీయత మెరుగుపడుతుందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. ఈ అభివృద్ధి బెంగళూరు, హైదరాబాద్ వంటి రెండు ప్రధాన నగరాల మధ్య ఆర్థిక, ఐటీ, వాణిజ్య సంబంధాలను మరింత బలపరచనుంది. ప్రయాణికులకు వేగవంతమైన, భద్రమైన మరియు విశ్వసనీయమైన రైలు సేవలను అందించాలనే లక్ష్యంతో Indian Railways దక్షిణ భారతంలో మరో కీలక అడుగు వేసిందని చెప్పుకోవచ్చు.
More From GoodReturns

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

Train tickets: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఇకపై వీరికి జీవితాంతం ఫ్రీ జర్నీ!

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

Hyderabad: హైదరాబాద్లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..



Click it and Unblock the Notifications