SBI, UB సహా అమ్మకానికి రూ.2,836 కోట్ల ఎన్పీఏలు
నిరర్థక ఆస్తుల (NPA) వసూలు చేసేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా తాకట్టుకింద పెట్టిన ఆస్తులను విక్రయించేందుకు సిద్ధమయ్యాయి. ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు సంయుక్తంగా రూ.2,836 కోట్ల విలువైన NPAలు విక్రయించనున్నట్లు ప్రకటించాయి.
ఇందులో SBIకి సంబంధించి రూ.1,554.87 కోట్ల విలువైన 3 ఆస్తులు ఉండగా, యూనియన్ బ్యాంకుకు చెందిన రూ.1,280.87 కోట్ల విలువైన 11 ఆస్తులు ఉన్నాయి. అన్ని రకాల ఆస్తులకు ఈ-వేలం నిర్వహించనున్నారు.
ప్రభుత్వానికి భారీ ఊరట: ఏపీ-తెలంగాణ కలెక్షన్లు ఎంతంటే?
SBI విక్రయించనున్న వాటిలో రోహిత్ ఫెర్రో టెక్ బకాయిపడిన రూ.1,313.67 కోట్ల రుణాలు, ఇంపెక్స్ ఫెర్రో టెక్ రూ.200.67 కోట్ల రుణాలకు చెందిన ఆస్తులు ఉన్నాయి. ఈ రెండు కంపెనీలు కోల్కతా కేంద్రస్థానంగా ఉన్న ఎస్కేపీ గ్రూప్ ఆధ్వర్యంలోనివి.
అవని ప్రాజెక్ట్స్ అండ్ ఇన్ప్రా రూ.40.53 కోట్ల రుణ బకాయిలు కూడా ఉన్నాయి. యూనియన్ బ్యాంకు వేలానికి ఉంచిన వాటిల్లో జీవీకే పవర్ గోయిండ్వాల్ సాహెబ్ రూ.444 కోట్లు, రాజమండ్రి గోదావరి బ్రిడ్జి రూ.153 కోట్లు ఉన్నాయి.