SBI alert: ఈ తేదీల్లో యోనో, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో లైట్, యూపీఐ సేవలుండవ్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) సేవలు మూడు రోజుల పాటు పని చేయవని బ్యాంకు వెల్లడించింది. నేటి నుండి వరుసగా మూడు రోజులు అంటే మే 21, 22, 23 తేదీల్లో మెయింటెనెన్స్ కారణంగా ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ వంటి సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది.
మే 21వ తేదీ గం.22.45 నుండి మే 22 గం.1.15 వరకు, అలాగే మే 23వ తేదీ గం.2.40 నుండి గం.6.10 వరకు సేవలు అందుబాటులో ఉండవని ఎస్బీఐ ట్వీట్ చేసింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్, కరోనా ఆంక్షల నేపథ్యంలో బ్యాంకింగ్ పని వేళల్లో మార్పులు చేసింది. ప్రస్తుతం బ్యాంకులు ఉదయం గం.10 నుండి మధ్యాహ్నం గం.2 వరకు పని చేస్తున్నాయి. మే 31వ తేదీ వరకు ఇది అమల్లో ఉంటుంది.
దేశవ్యాప్తంగా ప్రతిరోజు లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత వారం వరకు రోజుకు మూడు నుండి నాలుగు లక్షల కొత్త కేసులు నమోదుకాగా, ఇప్పుడు ఆ దిగువకు చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోంది. దేశంలో పలు ప్రాంతాల్లో కరోనా లాక్ డౌన్, కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి.