For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జియో ప్లాట్‌ఫాంలోకి సౌదీ అరేబియా వెల్త్ ఫండ్ కంపెనీ

|

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ డిజిటల్ అనుబంధ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌లో మరో కంపెనీ పెట్టుబడులు పెట్టనుంది. సౌదీ అరేబియాకు చెందిన వెల్త్ ఫండ్.. పబ్లిక్ ఇన్వెస్టుమెంట్ ఫండ్ (PIF) 1.5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసి 2.33 శాతం వాటాను దక్కించుకోనుందని తెలుస్తోంది. ఈ పెట్టుబడి కూడా వస్తే జియో ప్లాట్‌ఫామ్స్‌లో రిలయన్స్ వాటా దాదాపు 25 శాతం వాటా తగ్గనుంది.

పదో ఇన్వెస్టర్‌తో రూ.1,04,327 కోట్లు: జియోలో అంబానీ ఎంత విక్రయించారంటే?పదో ఇన్వెస్టర్‌తో రూ.1,04,327 కోట్లు: జియోలో అంబానీ ఎంత విక్రయించారంటే?

2021 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను రుణరహిత కంపెనీగా తీర్చిదిద్దాలని ముఖేష్ అంబానీ భావిస్తున్నారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే తొమ్మిది కంపెనీలు పదిసార్లు (ఒక కంపెనీ రెండోసారి పెట్టుబడి పెట్టింది) ఇన్వెస్ట్ చేశాయి. దీంతో దాదాపు 23 శాతం వాటాను విక్రయించింది రిలయన్స్. ఇప్పటికే అబుదాబికి చెందిన ముబాదాల, ఏడీఐఏలు వరుసగా 1.2 బిలియన్ డాలర్లు, 750 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశాయి.

Saudi Arabias wealth fund to pick up stake in India’s Jio for $1.5 billion

ఇప్పటి వరకు జియో ప్లాట్‌ఫామ్స్‌లో 22.38 శాతం వాటాను విక్రయించింది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ వాటా విక్రయాల ద్వారా రూ.1,04,326.90 కోట్లు సమీకరించింది. ఏప్రిల్ 22న ఫేస్‌బుక్ - జియో డీల్‌తో ఈ పెట్టుబడుల రాకడ ప్రారంభమైంది. జియో ప్లాట్‌ఫాంలో మరో ఏడు నుండి 8 శాతం విక్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- ఫేస్‌బుక్ - రూ.43,573.62 కోట్లు - 9.99 శాతం వాటా
- సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ - రూ.5,655.75 కోట్లు - 1.15 శాతం వాటా
- విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ - రూ.11,367.00 కోట్లు - 2.32 శాతం వాటా
- జనరల్ అట్లాంటిక్ - రూ.6,598.38 కోట్లు - 1.34 శాతం వాటా
- కేకేఆర్ - రూ.11,367.00 కోట్లు - 2.32 శాతం వాటా
- ముబాదాల - రూ.9,093.60 కోట్లు - 1.85 శాతం వాటా
- సిల్వర్ లేక్ (రెండోసారి) - రూ.4,546.80 కోట్లు - 0.93 శాతం వాటా
- ADIA - రూ.5,683.50 కోట్లు - 1.16 శాతం వాటా
- TPG - రూ.4,546.8 కోట్లు - 0.93 శాతం వాటా
- ఎల్-కేటర్టన్ - రూ.1,894.50 కోట్లు - 0.39 శాతం వాటా

English summary

జియో ప్లాట్‌ఫాంలోకి సౌదీ అరేబియా వెల్త్ ఫండ్ కంపెనీ | Saudi Arabia's wealth fund to pick up stake in India’s Jio for $1.5 billion

Saudi Arabia’s wealth fund PIF is all set to pick up a stake in India’s digital platform Jio, part of the Reliance Industries empire owned by Mukesh Ambani. The Public Investment Fund (PIF) will acquire 2.33 per cent for an estimated $1.5 billion.
Story first published: Tuesday, June 16, 2020, 20:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X