శాంసంగ్ చైర్మన్ లీకున్-హీ కన్నుమూత
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ లీకున్-హీ 78వ ఏట కన్నుమూశారు. సౌత్ కొరియాకు చెందిన ఈ కంపెనీని అంతర్జాతీయవ్యాప్తంగా ఇంత ప్రాచుర్యం పొందడానికి ఈయన చేసిన కృషి ఎనలేనిది. లీకున్-హీ ఆధ్వర్యంలో స్మార్ట్ ఫోన్ ప్రపంచ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీగా నిలిచింది. మొమెరీ చిప్స్ తయారీలోను ముందుంది. ప్రస్తుతం ఈ కంపెనీ టర్నోవర్ దక్షిణ కొరియా జీడీపీలో 5వ వంతు కావడం గమనార్హం. 2014లో ఆయనకు గుండెపోటు వచ్చింది. లీకున్-హీ మృతి చెందాడని కంపెనీ ఓ ప్రకటనలో విచారం వ్యక్తం చేసింది.
ఆరేళ్లుగా హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఆయన గుండెకు చికిత్స చేయించుకున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. కొరియాలోని డేగులో 1942 జనవరి 9వ తేదీన జన్మించారు లీకున్-హీ. తన తండ్రి, శాంసంగ్ వ్యవస్థాపకులు లీబైంగ్-చుల్ మరణం అనంతరం 1987లో శాంసంగ్ బాధ్యతలు చేపట్టారు.
స్మార్ట్ ఫోన్లు, టెలివిజన్లు, కంప్యూటర్ చిప్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తయారు చేసే అగ్రగామి సంస్థగా తయారు చేశారు. ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ సంస్ధగా తీర్చిదిద్దారు. అతని తండ్రి మొదట ఫిష్, ఫ్రూట్ ఎగుమతిదారు.