రూ.500 ఫేక్ కరెన్సీ నోట్లు భారీగా పెరిగాయి, 79,669కి పైగా నోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో రూ.500 వ్యాల్యూ కలిగిన నోట్లలో 79,669 వరకు నకిలీ నోట్లను గుర్తించినట్లు ఆర్బీఐ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే నకిలీ నోట్ల సంఖ్య రెట్టింపు అయింది. రూ.2000 నకిలీ నోట్లను 13,604 గుర్తించారు. 2020-21తో పోలిస్తే 54.6 శాతం పెరిగాయి. 2021-22లో అన్ని వ్యాల్యూ నోట్లు కలిపి మొత్తంగా 2,30,971 నకిలీ నోట్లను గుర్తించింది.
2020-21లోని 2,08,625తో పోలిస్తే భారీగా పెరిగాయి. 2019-20లో మొత్తం నకిలీ నోట్ల సంఖ్య 2,96,695గా నమోదయింది. రూ.10, రూ.20, రూ.500, రూ.2000 వ్యాల్యూ కలిగిన నోట్ల సంఖ్య వరుసగా 16.4 శాతం, 16.5 శాతం, 11.7 శాతం, 101.90 శాతం, 54.+ శాతం మేర పెరిగినట్లు ఆర్బీఐ నివేదిక తెలిపింది.
అయితే రూ.50, రూ.100 వ్యాల్యూ కలిగిన నకిలీ నోట్లు వరుసగా 28.7 శాతం, 16.7 శాతం మేర తగ్గాయి. 2021-22లో నమోదైన మొత్తం నకిలీ నోట్లలో 6.9 శాతం నోట్లను ఆర్బీఐ గుర్తించింది. మిగతా 93.1 శాతం నోట్లను ఇతర బ్యాంకులు గుర్తించాయి.