భద్రతా కారణాలతో చైనాకు చెందిన యాప్స్ పైన భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఆత్మనిర్భర్ భారత్ పేరుతో సాధ్యమైనంత వరకు దిగుమతులు తగ్గించుకోవాలని కూడా నిర్ణయించింది. భారతీయులు కూడా చైనా వస్తువులను కొనుగోలు చేయడం చాలా వరకు తగ్గించారు. ఆటోమొబైల్ నుండి కెమికల్స్ వరకు ఎన్నో వస్తువుల దిగుమతులు తగ్గించాలని ఆయా రంగాలు భావిస్తున్నాయి. చైనా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారత్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది.

రూ.25వేల కోట్ల మేర ఆదా
కెమికల్ దిగుమతులను తగ్గించాలని భావిస్తోంది. దేశీయ తయారీదారులను ప్రోత్సహించేందుకు వారికి ప్రత్యేక రాయితీలు ఇచ్చేందుకు సిద్ధమైంది. కెమికల్స్ దిగుమతులు తగ్గింపులో భాగంగా 75 కీలక కెమికల్స్ జాబితాను రూపొందించారు. ఉత్పత్తి వ్యాల్యూలో 10 శాతం రాయితీ ఇచ్చే ప్రతిపాదన కూడా ఉంది. ఈ కెమికల్స్ దిగుమతులు తగ్గించడం వల్ల అయిదేళ్ల కాలంలో రూ.25వేల కోట్ల మేరా ఆదా కానుంది.

1.5 లక్షల కోట్ల దిగుమతులు
భారత్కు దిగుమతి అయ్యే కెమికల్స్ రూ.1.5 లక్షల కోట్లుగా ఉంటుంది. ఇందులో 85 శాతం నుండి 90 శాతం వరకు కెమికల్స్ చైనా నుండి దిగుమతి అవుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ కెమికల్స్ను యాక్టివ్ ఫార్మాస్యూటికల్స్ ఇంగ్రిడియెంట్స్, ఇతర పరిశ్రమ రంగాల్లో ఉపయోగిస్తారు. కెమికల్స్ ఎసెన్షియల్ ఉత్పత్తులు. ఇవి వివిధ రకాల మెడిసిన్స్లో ఉపయోగిస్తారు.

పీఎల్ఐ స్కీం
దిగుమతి అయ్యే కెమికల్స్లో చైనా వాటానే ఎక్కువగా ఉంటుందని, ఈ నేపథ్యంలో దేశీయ తయారీదారులను ప్రోత్సహించేందుకు ఇప్పటికే పీఎల్ఐ స్కీం ప్రారంభించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక్కడ తయారు చేసుకోగలిగిన కెమికల్స్ కోసం చైనా సహా ఇతర దిగుమతులపై ఆధారపడటం సరికాదని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు, పీఎల్ఐ స్కీం కోసం కెమికల్ డిపార్టుమెంట్ కమిటీని వేసింది. దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇస్తుంది.
More From GoodReturns

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

పశ్చిమాసియాలో యుద్ధం.. చమురు ధరల్లో భారీ పెరుగుదల.. ఎంతలా ఎగబాకాయంటే..

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications