భద్రతా కారణాలతో చైనాకు చెందిన యాప్స్ పైన భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఆత్మనిర్భర్ భారత్ పేరుతో సాధ్యమైనంత వరకు దిగుమతులు తగ్గించుకోవాలని కూడా నిర్ణయించింది. భారతీయులు కూడా చైనా వస్తువులను కొనుగోలు చేయడం చాలా వరకు తగ్గించారు. ఆటోమొబైల్ నుండి కెమికల్స్ వరకు ఎన్నో వస్తువుల దిగుమతులు తగ్గించాలని ఆయా రంగాలు భావిస్తున్నాయి. చైనా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారత్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది.

రూ.25వేల కోట్ల మేర ఆదా
కెమికల్ దిగుమతులను తగ్గించాలని భావిస్తోంది. దేశీయ తయారీదారులను ప్రోత్సహించేందుకు వారికి ప్రత్యేక రాయితీలు ఇచ్చేందుకు సిద్ధమైంది. కెమికల్స్ దిగుమతులు తగ్గింపులో భాగంగా 75 కీలక కెమికల్స్ జాబితాను రూపొందించారు. ఉత్పత్తి వ్యాల్యూలో 10 శాతం రాయితీ ఇచ్చే ప్రతిపాదన కూడా ఉంది. ఈ కెమికల్స్ దిగుమతులు తగ్గించడం వల్ల అయిదేళ్ల కాలంలో రూ.25వేల కోట్ల మేరా ఆదా కానుంది.

1.5 లక్షల కోట్ల దిగుమతులు
భారత్కు దిగుమతి అయ్యే కెమికల్స్ రూ.1.5 లక్షల కోట్లుగా ఉంటుంది. ఇందులో 85 శాతం నుండి 90 శాతం వరకు కెమికల్స్ చైనా నుండి దిగుమతి అవుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ కెమికల్స్ను యాక్టివ్ ఫార్మాస్యూటికల్స్ ఇంగ్రిడియెంట్స్, ఇతర పరిశ్రమ రంగాల్లో ఉపయోగిస్తారు. కెమికల్స్ ఎసెన్షియల్ ఉత్పత్తులు. ఇవి వివిధ రకాల మెడిసిన్స్లో ఉపయోగిస్తారు.

పీఎల్ఐ స్కీం
దిగుమతి అయ్యే కెమికల్స్లో చైనా వాటానే ఎక్కువగా ఉంటుందని, ఈ నేపథ్యంలో దేశీయ తయారీదారులను ప్రోత్సహించేందుకు ఇప్పటికే పీఎల్ఐ స్కీం ప్రారంభించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక్కడ తయారు చేసుకోగలిగిన కెమికల్స్ కోసం చైనా సహా ఇతర దిగుమతులపై ఆధారపడటం సరికాదని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు, పీఎల్ఐ స్కీం కోసం కెమికల్ డిపార్టుమెంట్ కమిటీని వేసింది. దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇస్తుంది.
More From GoodReturns

ఈస్టర్ 2026: గుడ్ ఫ్రైడే, పామ్ సండే, లెంట్ తేదీల పూర్తి వివరాలు ఇవిగో..

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications