భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి ప్రభావం భారీగానే పడిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రూ.20 లక్షల కోట్ల నుండి రూ.33 లక్షల కోట్ల వరకు నష్టం జరిగిందని అంచనాలు వెల్లడవుతున్నాయి. వైరస్-లాక్డౌన్ కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ ఎకానమీ జీడీపీలో 10 శాతం లేదా రూ.20 లక్షల కోట్ల మేరకు నష్టపోతుందని మాజీ ఫైనాన్స్ సెక్రటరీ సుభాష్ చంద్ర గార్గ్ అన్నారు.

40 ఏళ్ల తర్వాత మొదటిసారి
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీ వాస్తవానికి రూ.1.4 లక్షల కోట్ల నుండి రూ.1.5 లక్షల కోట్ల వరకు ఉంటుందని లేదా ఇది జీడీపీలో 0.7 శాతమని తెలిపారు. 40 సంవత్సరాల తర్వాత తొలిసారి భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో భారీగా కుంచించుకుపోనుందని గార్గ్ చెప్పారు. భారత వృద్ధి దశాబ్దాల నాటికి చేరుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

బ్రహ్మాస్త్రం ఉపయోగించాం
ఇప్పటికే మందగమనం కారణంగా 2019-20 ఆర్థిక సంవత్సరం ఏమాత్రం ఆశాజనకంగా లేదని చెప్పారు. వృద్ధి రేటు 11 ఏళ్ల కనిష్టానికి చేరుకుంది. మూడు వారాల లాక్ డౌన్తో భారత్ నుండి కరోనాను తరిమికొట్టగలమని భావించామన్నారు. ప్రారంభంలో కరోనా ప్రభావం కొంతమాత్రమే ఉన్నప్పుడు ఎకనమిక్, హ్యూమన్ లాక్ డౌన్ వంటి బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించామన్నారు.

లాక్ డౌన్ నష్టాలు
కరోనా మహమ్మారి కారణంగా మార్చి 25వ తేదీ నుండి భారతదేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు. సంస్థలు, ఉద్యోగులను, రైతులను, ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.21 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించింది. కానీ కరోనా వల్ల జరిగిన నష్టం రూ.20 లక్షల కోట్ల నుండి రూ.33 లక్షల కోట్ల వరకు ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications