కరోనా మహమ్మారిపై పోరుకు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రాలకు భారీగా ఖర్చులు అవుతున్నాయి. మరోవైపు ఆరు నెలలుగా ఆదాయాలు తగ్గుతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం భారీగా తగ్గడంతో.. అక్కడి నుండి రాష్ట్రాలకు వచ్చే నిధులు కూడా తగ్గాయి. ఈ పరిస్థితుల్లో 18 రాష్ట్రాల సమష్టి ఆదాయ లోటు 285 శాతం పెరిగింది.
బడ్జెట్లో వేసిన అంచనాతో పోలిస్తే ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఈ మేరకు పెరిగింది. ఏడాది క్రితం ఇదే క్వార్టర్లో 12.9 శాతం పెరిగినట్లు ఇండియా రేటింగ్స్ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 18 పెద్ద రాష్ట్రాల ఆర్థికలోటు, మొత్తం వ్యయం, రిసిప్ట్స్ మధ్య అంతరం మొదటి క్వార్టర్లో 40.7 శాతంగా ఉంది. అంతకుముందు ఏడాది ఇది 13.4 శాతంగా మాత్రమే ఉంది.

ఆదాయాల్లో భారీ క్షీణత
ఆదాయంలో క్షీణత, కరోనా కారణంగా భారీ ఖర్చుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాయి. కరోనా, లాక్ డౌన్ వల్ల అన్ని రకాల పన్నులు తీవ్రంగా పడిపోయిన విషయం తెలిసిందే. ఏప్రిల్-జూన్ కాలానికి కేవలం 18 రాష్ట్రాల రెవెన్యూ రిసిప్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ఏడాది ప్రాతిపదికన ఆదాయం 18.41 శాతం తగ్గగా, మరోవైపు ఖర్చులు 11.7 శాతం పెరిగాయి. అయితే వివిధ రాష్ట్రాల్లో ఆదాయం, ఖర్చుల్లో రాష్ట్రాన్ని బట్టి హెచ్చుతగ్గులు ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్, చత్తీస్గఢ్, నాగాలాండ్, ఒడిశా మినహా మిగతా రాష్ట్రాల్లో ఆదాయ తగ్గుదల డబుల్ డిజిట్తో ఉంది. ఆంధ్రప్రదేశ్, మెఘాలయ, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మాత్రమే ఏడాది ప్రాతిపదికన పెరిగింది.

ఈ రాష్ట్రాల్లో తగ్గింపులు..
కొన్ని రాష్ట్రాల్లో 2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్తో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం అదే కాలంలో ద్రవ్యలోటు పెరిగినప్పటికీ మొదటి క్వార్టర్లో ఆదాయ మిగులును నమోదు చేశాయి. ఒడిశా, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలపై కరోనా ప్రభావం భారీగానే ఉంది. మొత్తంగా 18 రాష్ట్రాలు తమ ఖర్చుల్లో వేతన, పెన్షన్ ఖర్చులను 10.5 శాతం తగ్గించాయి. సబ్సిడీలు 39.9 శాతం తగ్గించాయి. అదే సమయంలో ఈ ప్రభుత్వాలు ప్రజారోగ్యం, పరిపాలనా ఖర్చులను 40.1 శాతం పెంచాయి. తమిళనాడు, కేరళ, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఈ తగ్గింపులు ఎక్కువగా కనిపించగా, చత్తీస్గఢ్, హర్యానా, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో తక్కువగా ఉంది.

ఆర్బీఐ స్పెషల్ విండో.. ఏపీ, తెలంగాణ
రాష్ట్రాల ఆదాయ, ఖర్చులు ఒత్తిడిలో ఉన్నట్లు ఇండియా రేటింగ్స్ నివేదిక వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కరోనా కారణంగా రాష్ట్రాల ఖర్చులు పెరుగుతున్నాయి. కేంద్రానికి ఆదాయం లేక నిధులు తగ్గుతున్నాయి. అలాగే అప్పులు పెరుగుతున్నాయి. ఆర్బీఐ లిక్విడిటీ విండోను (స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ/వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్/ఓవర్ డ్రాఫ్ట్) చాలా రాష్ట్రాలు తక్కువగా ఉపయోగించుకున్నాయి. ఈ సంవత్సరానికి ఇప్పటి వరకు ఈ విండోను ఉపయోగించిన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, పంజాబ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్తో పాటు నాగాలాండ్, మణిపూర్, మిజోరాం వంటి చిన్న రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు కరోనాతో పాటు ఇంతకుముందు కూడా ఉపయోగించుకున్నాయి. మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలు క్యూ1లో దీనిని అసలు ఉపయోగించలేదు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications