IPO News: ఇదో వింత ఐపీవో.. మెున్న కొనటానికి ఎగబడ్డ జనం లిస్ట్ కాగానే అమ్మేస్తున్నారు..

Resourceful Automobile IPO: ఎస్ఎమ్ఈ కేటగిరీలో ఇటీవలి కాలంలో అనేక కంపెనీల ఐపీవోలు మార్కెట్లోకి క్యూ కడుతున్నాయి. అయితే ఈ క్రమంలో బెట్టింగ్ వేసేందుకు దిగుతున్న చాలా మంది ఇన్వెస్టర్లు అసలు కంపెనీ వ్యాపారం, ఫండమెంట్స్ వంటి కనీస విషయాలను సైతం పరిశీలించటం లేదని ఈ కంపెనీ ఐపీవో నిరూపించింది. ఇది మార్కెట్లో పెద్ద చర్చకు సైతం దారితీసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది దిల్లీకి చెందిన రిసోర్స్‌ఫుల్ ఆటోమొబైల్ కంపెనీ ఐపీవో గురించి. నేడు బీఎస్ఈలో కంపెనీ షేర్లు ఫ్లాట్ జాబితాను నమోదు చేశాయి. వాస్తవానికి ఇష్యూ సమయంలో కంపెనీ ఒక్కో షేరును రూ.117 ధరకు విక్రయించగా అదే రేటు వద్ద ఫ్లాట్ ప్రారంభాన్ని చూశాయి. అయితే జాబితా తర్వాత అమ్మకాల ఒత్తిడి నెలకొని కంపెనీ షేర్లు స్టాక్ దాదాపు 4.9% పడిపోయింది. ఇంట్రాడేలో రూ.111 కనిష్ఠ స్థాయికి చేరుకుంది. అయితే దీని తర్వాత కొనుగోళ్ల కోలాహలం మెుదలవ్వటంతో స్టాక్ అప్పర్ సర్క్యూట్ తాకి ఇంట్రాడేలో గరిష్ఠంగా రూ.122.85కి చేరుకుంది.

Resourceful Automobile IPO listed flat after huge discussion on Investors Betting

రిసోర్స్‌ఫుల్ ఆటోమొబైల్ ఐపీవో ఆగస్టు 22న ప్రారంభమై ఆగస్టు 26న ముగింసింది. ఐపీవో మార్కెట్ల నుంచి రూ.12 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా ఐపీవోకి రాగా భారీగా 500 సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. 2018లో దిల్లీలో స్థాపించబడిన కంపెనీ సాహ్ని ఆటోమొబైల్ బ్రాండ్ పేరుతో పనిచేస్తుంది. ఇది యమహా ద్విచక్ర వాహనాల సేల్స్ అండ్ సర్వీస్ వ్యాపారంలో ఉన్న డీలర్. డిసెంబర్ 28 నాటికి కంపెనీకి రెండు షోరూమ్‌లు, 8 మంది ఉద్యోగులు ఉన్నారు. ఐపీవో నుంచి సమీకరించిన మెుత్తాన్ని కంపెనీ రుణాల చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, దిల్లీలో కొత్త షోరూమ్ తెరిచేందుకు వినియోగించాలని నిర్ణయించింది.

ఒక చిన్న ఆటోమెుుబైల్ డీలర్ షిప్ కంపెనీ షేర్లపై ఇన్వెస్టర్లు బెట్టింగ్ వేసేందుకు విరుచుకుపడటం అంతర్జాలంలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ క్రమంలో కంపెనీ కంపెనీ 9.76 లక్షల షేర్లను విక్రయించగా.. ఏకంగా 40.76 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి.

సెబీ హెచ్చరిక..
ఎస్ఎమ్ఈ ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫారమ్‌లో జాబితా చేయబడిన కంపెనీలను ఆడిట్ చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని చార్టర్డ్ అకౌంటెంట్‌లను మార్కెట్ రెగ్యూలరీ SEBI హోల్‌టైమ్ మెంబర్ అశ్విని భాటియా శుక్రవారం కోరారు. ఎస్ఎమ్ఈ ప్లాట్‌ఫారమ్‌లో లిస్టింగ్, ట్రేడింగ్‌లో 'ధరల తారుమారు' గురించి మార్చిలో సెబీ చైర్‌పర్సన్ మధబి పూరి బుచ్ ఆందోళనలు లేవనెత్తుతూ పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించిన సంగతి తెలిసిందే.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+