For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు: ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుండి మరింత భారం

|

అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నాయి. దీంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం స్వల్పంగా తగ్గాయి. లీటర్ పెట్రోల్ పైన 17 పైసలు, లీటర్ డీజిల్ పైన 21 పైసలు తగ్గింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.71.71, ముంబైలో రూ.77.40, కోల్‌కతాలో రూ.74.38, చెన్నైలో రూ.74.51గా ఉంది. డీజిల్ ధర లీటర్ ఢిల్లీలో రూ.64.30, ముంబైలో రూ.67.34, కోల్‌కతాలో రూ.66.63, చెన్నైలో రూ.67.86గా ఉంది.

కరోనా వైరస్: గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గడం లేదు?కరోనా వైరస్: గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గడం లేదు?

ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్‌లరో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌లో సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. లీటర్ పెట్రోల్ పైన ఇప్పటి వరకు 31 శాతం వ్యాట్‌తో పాటు అదనంగా రూ.2 వసూలు చేసేవారు. ఉత్తర్వుల మేరకు ఇక నుండి వ్యాట్‌తో పాటు రూ.2.76 వసూలు చేస్తారు. అంటే లీటర్ పెట్రోల్ పైన 76 పైసలు పెరుగుతుంది.

Relief to consumers ss fuel prices cut sharply on sunday

అదేవిధంగా డీజిల్ లీటర్ పైన వ్యాట్ ప్లస్ రూ.2గా ఇప్పటి వరకు ఉంది. ఇక నుండి వ్యాట్ ప్లస్ 3.07గా సవరించారు. వ్యాట్ 22.25 శాతం వ్యాట్ ఉంది. ఇక నుండి లీటర్ డీజిల్ పైన రూ.1.07 పెరగనుంది. ఈ పెరుగుదల మార్చి 1 (ఆదివారం, నేటి నుండి) అమలులోకి వచ్చాయి.

English summary

తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు: ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుండి మరింత భారం | Relief to consumers ss fuel prices cut sharply on sunday

The fuel prices saw further decline as the price of petrol was cut by 17 paise and that of diesel by 21 paise on Sunday. Petrol now costs Rs 71.71 per litre in Delhi, Rs 77.40 per litre in Mumbai, Rs 74.38 per litre in Kolkata and Rs 74.51 per litre in Chennai after the price cut.
Story first published: Sunday, March 1, 2020, 17:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X