ముంబై: దేశీయ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్- మరో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. రిలయన్స్ జియో సేవలను మరింత విస్తరించుకోవడంలో భాగంగా ఓ విదేశీ కంపెనీతో టైఅప్ కానుంది. ఈ రెండు కంపెనీలు కలిసి జాయింట్ వెంచర్గా ఏర్పడనున్నాయి. ప్రత్యేకంగా ఓ కార్పొరేట్ కంపెనీని నెలకొల్పనున్నాయి. 51, 49 శాతం వాటాలతో ఈ జాయింట్ వెంచర్ కంపెనీ ఆవిర్భవించనుంది.
లగ్జెంబర్గ్కు చెందిన శాటిలైట్ ఆధారిత బ్రాడ్బ్యాండ్ కంపెనీ ఎస్ఈఎస్తో ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నామని రిలయన్స్ జియో వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. దేశంలో బ్రాడ్బ్యాండ్ సేవలను మరింత విస్తరించుకోవడంలో భాగంగా ఎస్ఈఎస్ కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు తెలిపింది. ఉపగ్రహ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంతో బ్రాడ్బ్యాండ్ సేవలను అందించే దిశగా ముందడుగు వేశామని పేర్కొంది.

జియోస్టేషనరీ, మీడియం ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ కన్స్టెల్లేషన్స్, జియో స్పేస్ టెక్నాలజీ ఆధారంగా ఈ బ్రాడ్బ్యాండ్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని రిలయన్స్ పేర్కొంది. మల్టీ-గిగాబైట్ లింక్స్, మొబైల్ బ్యాక్ హాల్, రిటైల్ కస్టమర్ల వరకూ ఈ సేవలను తీసుకెళ్తామని తెలిపింది. జాయింట్ వెంచర్గా ఏర్పాటు చేయబోయే కంపెనీలో 51:49 శాతం ప్రాతిపదికన ఎస్ఈఎస్, జియోల వాటాలు ఉంటాయని వివరించింది.
జియో స్పేస్ టెక్నాలజీని ఎస్ఈఎస్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుందని, దీనికి అవసరమైన ప్లాట్ఫామ్స్ను తాము సమకూరుస్తామని పేర్కొంది. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఉపగ్రహ ఆధారిత బ్రాడ్ బ్యాండ్ సేవలను అందించడానికి అవసరమైన ఏర్పాట్లను త్వరలోనే చేపడతామని, భారతీయ మార్కెట్లో అడుగు పెట్టబోతోండటం సంతోషాన్ని ఇస్తోందని ఎస్ఈఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టీవ్ కాలర్ చెప్పారు. హైక్వాలిటీ కనెక్టివిటీతో తమ సేవలను యూజర్లకు అందిస్తామని అన్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications