బ్రిటన్కు చెందిన మరో కంపెనీని కొనుగోలు చేసిన రిలయన్స్
ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ బ్రిటన్కు చెందిన ఓ కంపెనీని కొనుగోలు చేసింది. హోటల్తో పాటు గోల్ఫ్ కోర్స్ కలిగిన స్టోక్ పార్కును సొంతం చేసుకుంది. ఈ ఒప్పందం వ్యాల్యూ రూ.592 కోట్లు. దీంతో రిలయన్స్ హాస్పిటాలిటీ ఆస్తుల్లో ఇక నుండి స్టోక్స్ పార్క్ కూడా భాగం కానుంది.
ఇంధనేతర రంగంలోకి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న ముఖేష్ అంబానీ ఇటీవలే బ్రిటన్కు చెందిన ప్రముఖ ఆట బొమ్మల సంస్థ హామ్లేస్ను కొనుగోలు చేశారు. దీంతో భారత మార్కెట్లో మెరుగైన అవకాశాలు ఉన్న ఈ రంగంలోకి హామ్లేస్తో ప్రవేశించాలని రిలయన్స్ యోచిస్తోంది. అలాగే వినియోగ ఆధారిత సేవా రంగాలపై ముఖేష్ దృష్టి సారించారు.
ఇందులో అందులో భాగంగా జియో పేరిట టెలికాం రంగంతో పాటు హాస్పిటాలిటీ సెక్టార్లోకి ప్రవేశించారు. గత కొంతకాలంగా అక్వైర్ చేసుకుంటోంది. 14 శాతం రిటైల్, 80 శాతం టెక్నాలజీ, మీడియా, టెలికం సెక్టార్, 6 శాతం ఎనర్జీ రంగంలో అక్వైర్ చేసింది.