For Quick Alerts
For Daily Alerts
కరోనా సమయంలో ప్రతి ఉద్యోగి పాత్ర కీలకం: ముఖేష్ అంబానీ
|
ముంబై: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా విపత్కర పరిస్థితులు ఉన్నాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అన్నారు. జూన్ 24వ తేదీన జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 44వ ఏజీఎంలో మాట్లాడారు. కరోనా వంటి క్లిష్ట సమయంలో తమ కంపెనీ ఉద్యోగాలు ఎంతో గొప్పగా పని చేశారని, ఉద్యోగుల పనితీరు వల్ల అంచనాలకు మించి లాభాలు వచ్చాయని అన్నారు. వినియోగదారుల ఇబ్బందులను త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు.
ఈ ఏడాది జియో ఇనిస్టిట్యూట్ను ప్రారంభించనున్నట్లు ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ చెప్పారు. ఇక్కడ 21వేల మందికి ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. కరోనా క్లిష్ట సమయంలో పేదలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉచిత భోజనం అందించిందన్నారు. ఉద్యోగులు, వారి కుటుంబాల పట్ల తాము బాధ్యతగా ఉంటామన్నారు. దేశంలో ఆక్సిజన్ అందించడంలో రిలయన్స్ 11వ స్థానంలో నిలిచిందన్నారు.
Comments
English summary
కరోనా సమయంలో ప్రతి ఉద్యోగి పాత్ర కీలకం: ముఖేష్ అంబానీ | Reliance Industries AGM: Every employee played a part against COVID 19 crisis, says Mukesh Ambani
Story first published: Thursday, June 24, 2021, 14:40 [IST]