కరోనా మహమ్మారి నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. తమ తమ దేశ ఆర్థిక వ్యవస్థకు అండగా ఉండేందుకు ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు చర్యలు తీసుకుంటున్నాయి. ఆర్బీఐ కూడా కీలక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా తాజా పరిణామాలను ఎదుర్కోవడానికి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (OMO) ద్వారా రూ.10వేల కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయనుంది.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని కొనసాగించేందుకు, రెండు నుంచి ఐదేళ్ల కాలపరిమితితో రూ.10,000 కోట్ల ప్రభుత్వ సెక్యూరిటీలను మార్చి 20వ తేదీన కొనుగోలును ప్రారంభించనున్నట్లు తెలిపింది. అన్ని మార్కెట్లు స్థిరంగా ఉండేలా చూడటం ముఖ్యమని ఆర్బీఐ పేర్కొంది. ఆర్బీఐ కొనుగోలు నిర్ణయాన్ని ప్రకటించడంతో బెంచ్ మార్క్ పదేళ్ల బాండ్ దిగుబడి 6.24 శాతానికి పడిపోయింది.

'కోవిడ్-19 మహమ్మారితో ఆర్థిక మార్కెట్లకు ముప్పు పొంచి ఉంది. స్థిరత్వం లోపించకుండా, సాధారణంగా నడిచేందుకు కావాల్సిన చర్యలను తీసుకుంటున్నామ'ని ఆర్బీఐ బుధవారం ప్రకటనలో తెలిపింది. బహుళ ధరల పద్ధతి వినియోగిస్తూ వేర్వేరు సెక్యూరిటీస్ వేలం ద్వారా రూ.10,000 కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీస్ కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది.
ఫిబ్రవరి 15, 2022 మెచ్యూరిటీపై 8.20% శాతం, ఏప్రిల్ 16, 2023పై 7.37%, జనవరి 28, 2024పై 7.32%, మే 25, 2025 మెచ్యూరిటీపై 7.72% చొప్పున కూపన్ రేటుతో సెక్యూరిటీస్ కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. డాలర్తో రూపాయి మారకం విలువ బలోపేతానికి ఈ నెల 16న 2 బిలియన్ డాలర్లను రూపాయి కొనుగోలు ద్వారా మార్కెట్లోకి పంప్ చేసింది. 23న మరో విడతలో 2 బిలియన్ డాలర్లు విక్రయించనుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications